HYD: ఫార్మా కంపెనీలపై ఈడీ దాడులు

ED Raids In Leading Pharma Companies At Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ ఫార్మా కంపెనీల్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. 

వివరాల ప్రకారం.. ఫినిక్స్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. రియల్‌ ఎస్టేట్‌, మైన్స్‌, ఆటో మొబైల్స్‌, ఫార్మా కంపెనీలను ఫినిక్స్‌ సంస్థ ఏర్పాటు చేసింది. శనివారం ఉదయం నుంచి ఏక కాలంలో 15 ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పటాన్‌చెరులో సోదాలు కొనసాగుతున్నాయి. కాగా, ఈడీ దాడులపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top