హైదరాబాద్‌కు 64 దేశాల రాయబారుల బృందం | Covid Vaccine: 64 Foreign Delegation Reached To Hyderabad | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ వ్యాక్సిన్‌పై చర్చించనున్న విదేశీ రాయబారులు

Dec 9 2020 12:06 PM | Updated on Dec 9 2020 1:08 PM

Covid Vaccine: 64 Foreign Delegation Reached To Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కట్టడికి కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ అభివృద్ధి చేస్తున్న పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను పరిశీలించేందుకు 64 దేశాల రాయబారులు బృందం హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఈ బృందంలో పలు దేశాల హైకమిషనర్‌లు కూడా ఉన్నారు. వీరు ఎయిర్‌పోర్టు నుంచి శామీర్‌పేటలోని జీనోమ్‌ వ్యాలీకి మరికాసేపట్లో చేరుకోనున్నారు. ఈ హైకమిషనర్‌, రాయబారుల బృందం రెండు గ్రూపులుగా విడిపోయి కోవిడ్ 19 వ్యాక్సిన్‌పై పనిచేస్తున్న భారత్ బయోటెక్ లిమిటెడ్, ఈ బయోలాజికల్స్ లిమిటెడ్‌ సంస్థలను సందర్శించి వ్యాక్సిన్‌పై చర్చించన్నారు. ఈ నేపథ్యంలో టీకాల పురోగతిని పరిశీలించి అనంతరం ఈ విదేశీ బృందం శాస్త్రవేత్తలతో భేటీ కానుంది.

ఇక సమావేశం ముగిసిన తర్వాత సాయంత్ర 5:50 గంటలకు అంబాసిడర్‌, హైకమిషనర్‌లు తిరిగి ఢిల్లీకి బయల్దేరనున్నారు. విదేశి పత్రినిధుల పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్టు వద్ద భద్రత ఏర్పాట్లు చేసింది. భారత్‌ బయోటెక్‌ అభివృద్ది చేస్తున్న కొవాగ్జిన్‌ టీకా ప్రస్తుతం మూడోదశ ట్రయల్స్‌లో ఉన్న విషయం తెలిసిందే. బయోలాజికల్‌ ఈ-సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ ఫేజ్‌-1, ఫేజ్‌-2 క్లినికల్‌ ట్రయల్స్‌కు కేంద్ర గత నెలలలో అనుమతిచ్చింది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా హైదరాబాద్‌కు వచ్చి భారత్‌ బయోటెక్‌ను సందర్శించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement