గోదావరి జ‌లాలు విడుద‌ల చేసిన సీఎం కేసీఆర్  | CM KCR To Release Godavari Water From Kondapochamma Sagar | Sakshi
Sakshi News home page

గోదావరి జ‌లాలు విడుద‌ల చేసిన సీఎం కేసీఆర్ 

Apr 6 2021 2:17 PM | Updated on Apr 6 2021 3:34 PM

CM KCR To Release Godavari Water From Kondapochamma Sagar - Sakshi

కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి సంగారెడ్డి కాల్వలో పారుతున్న కాళేశ్వర జలాలను.. వర్గల్‌ మండలం అవుసులపల్లి గ్రామంలో సంగారెడ్డి కెనాల్‌ నుంచి హల్దీ కాల్వలోకి కాళేశ్వర జలాలను విడుదల చేశారు. హల్దీ కాల్వలోకి 1600 క్యూసెక్కుల నీటిని విడుద‌ల చేశారు.

సాక్షి, సిద్ధిపేట: గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ మంగళవారం పర్యటించారు. కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి సంగారెడ్డి కాల్వలో పారుతున్న కాళేశ్వర జలాలను.. వర్గల్‌ మండలం అవుసులపల్లి గ్రామంలో సంగారెడ్డి కెనాల్‌ నుంచి హల్దీ కాల్వలోకి కాళేశ్వర జలాలను విడుదల చేశారు. హల్దీ కాల్వలోకి 1600 క్యూసెక్కుల నీటిని విడుద‌ల చేశారు. అనంత‌రం మర్కూక్‌ మండలం పాములపర్తి గ్రామంలో కాళేశ్వర జలాలను గజ్వేల్‌ కాల్వలోకి విడుదల చేశారు. నీటి విడుద‌ల సంద‌ర్భంగా గోదావ‌రి జ‌లాల‌కు సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.

కొండపోచమ్మ టు నిజాంసాగర్‌
కొండపోచమ్మ జలాశయం నుంచి సంగారెడ్డి కాల్వ ద్వారా 6.12 కిలోమీటర్‌ వద్ద నుంచి హల్దివాగులోకి గోదావరి జలాలను వదిలే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. తొలుత ఈ కాల్వ నుంచి వర్గల్‌ మండలం చౌదరిపల్లి బంధం చెరువులోకి నీటిని వదులుతారు. అక్కడి నుంచి మత్తడి దూకుతూ గొలుసుకట్టు చెరువులైన వర్గల్‌ పెద్దచెరువు, శాకారం ధర్మాయిచెరువు, అంబర్‌పేట కాని చెరువులు నిండి నాచారం మీదుగా హల్దివాగుకు గోదావరి జలాలు చేరుతాయి. మొత్తం 98 కిలోమీటర్ల పొడవుండే ఈ వాగు మెదక్‌ జిల్లా తుప్రాన్‌ మండలం యావపూర్, నాగులపల్లి మీదుగా కామారెడ్డి జిల్లాలో మంజీరానదిలో కలుస్తుంది. దీంతో కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, బీరుకూరు, నస్రుల్లాబాద్, నిజామాబాద్‌ జిల్లా బోధన్, కోటగిరి, వర్గి, ఆర్మూరు మొదలైన ప్రాంతాల రైతులకు చెందిన 14,268 ఎకరాలకు ప్రత్యక్షంగా, మరో 20వేల ఎకరాలకు పరోక్షంగా సాగునీరు అందించేందుకు దోహదపడనుంది.
చదవండి:
తెలంగాణ కోర్టుల్లో కరోనా కలకలం
జూబ్లీహిల్స్‌: కారుతో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ బీభత్సం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement