అన్నాడీఎంకేలో డిప్యూటీ కార్యదర్శిగా ట్రాన్స్‌జెండర్‌ | - | Sakshi
Sakshi News home page

అన్నాడీఎంకేలో డిప్యూటీ కార్యదర్శిగా ట్రాన్స్‌జెండర్‌

Jul 10 2026 5:22 AM | Updated on Jul 10 2026 5:22 AM

కొరుక్కుపేట: అన్నాడీఎంకే విధానాలు, విజయాలు, ఆ పార్టీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై రాష్ట్రమంతటా ప్రచారం సాగించే దిశగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్‌) ఆపార్టీ ప్రచార విభాగం డిప్యూటీ కార్యదర్శిగా ట్రానన్స్‌ జెండర్‌ అప్సరా రెడ్డిని నియమించారు. ఈ సందర్భంగా అప్సరారెడ్డి మాట్లాడుతూ పార్టీ ప్రచార విభాగం నేతగా చేపడుతున్న ఈ కొత్త బాధ్యత మరింత కష్టపడి పనిచేసి, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి గొప్ప ప్రేరణ ఇస్తుందని అన్నారు. మాజీ ముఖ్య మంత్రులు , పురట్చి తలైవర్‌ ఎంజీఆర్‌ ఉన్నత ఆదర్శాలను.. పురటితలైవి జయలలిత అమలు చేసిన ప్రజా సంక్షేమ విధానాలను, ఈపీఎస్‌ దార్శనికతలను మార్గదర్శకంగా తీసుకుని పార్టీని మరింత పటిష్టం చేయడానికి శాయశక్తులా పాటుపడతానని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement