రైల్వేస్టేషన్లలో కట్టుదిట్టంగా భద్రత | - | Sakshi
Sakshi News home page

రైల్వేస్టేషన్లలో కట్టుదిట్టంగా భద్రత

Jan 15 2026 8:45 AM | Updated on Jan 15 2026 8:45 AM

రైల్వేస్టేషన్లలో కట్టుదిట్టంగా భద్రత

రైల్వేస్టేషన్లలో కట్టుదిట్టంగా భద్రత

కొరుక్కుపేట: పొంగల్‌ పండుగ ప్రయాణం సజావుగా సురక్షితమైన ప్రయాణం కోసం చైన్నె డివిజన్‌ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. పొంగల్‌ పండుగ సెలవుల సందర్భంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, చైన్నె రైల్వే డివిజన్‌ ప్రత్యేక కార్యాచరణ , క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌ ఏర్పాట్లను అమలు చేసింది. ప్రధాన రైల్వే స్టేషన్లు , సబర్బన్‌ విభాగాలలో ప్రయాణికుల సురక్షితమైన ఇబ్బంది లేని ప్రయాణాన్ని నిర్ధారించడమే లక్ష్యంగా చర్యల తీసుకుంటోంది. పండుగ సీజన్‌లో లక్షలాది మంది ప్రయాణికులు తమ స్వస్థలాలకు ప్రయాణించే అవకాశం ఉన్నందున, డివిజన్‌ ఒక ప్రత్యేక ఉమ్మడి నియంత్రణ ప్రణాళికను అమలు చేసింది. ఈమేరకు చైన్నె సెంట్రల్‌, చైన్నె ఎగ్మోర్‌, బీచ్‌, తాంబరం, ఆవడి, చెంగల్పట్టు మరియు వేలచ్చేరితో సహా రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో అదనపు రైల్వే రక్షణ దళం (ఆర్‌పీఎఫ్‌), ప్రభుత్వ రైల్వే పోలీస్‌ (జీఆర్‌పీ), వాణిజ్య, కార్యాచరణ సిబ్బందిని నియమించారు. ప్రధాన స్టేషన్లలో ప్రయాణికులకు మార్గనిర్దేశం చేయడం, ప్రత్యేక రైళ్లను ఎక్కడానికి వారికి సహాయం చేయడం, రిజర్వ్‌ చేయబడిన కంపార్ట్‌మెంట్లలోకి అనధికారిక ప్రవేశాన్ని నిరోధించడంలో 50 మందికి పైగా టికెట్‌ ఇన్‌స్పెక్టర్లు నిమగ్నమై ఉన్నారని అధికారులు తెలిపారు. పెరంబూరు, విల్లివాక్కం, అంబత్తూరు, అవడి, తిరువళ్లూరు, అరక్కోణం, తిరుత్తణి, తండయార్‌పేట్‌, వి ఓసి నగర్‌, తిరువొత్తియూర్‌, ఎన్నూర్‌, పొన్నేరి, గుమ్మిడిపూండి , సూళ్లూర్‌పేట్‌ వంటి ప్రధాన నగర స్టేషన్లలో, చైన్నె బీచ్‌, పార్క్‌, ఎగ్మోర్‌, నుంగంబాక్కం, మాంబళం, సైదాపేట, గిండి, సెయింట్‌ థామస్‌ మౌంట్‌ తాంబరం వంటి ప్రధాన నగర స్టేషన్లలో, కాట్పాడి, అంబూర్‌, జోలార్‌పేట్టై, వానియంబాడితో సహా మొత్తం ఎంఆర్‌టీఎస్‌ విభాగం, కీలక జంక్షన్లలో భద్రతా దళాలను మోహరించినట్టు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement