
సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
కొరుక్కుపేట: ఉత్పత్తుల తయారీలో నాణ్యతా ప్రమాణాలతో పాటు సాంకేతికత అందిపుచ్చుకుని ముందుకు సాగాలని భారత ప్రభుత్వ టెక్స్టైల్స్ మంత్రిత్వశాఖ, టెక్స్టైల్స్ కమిషనర్ రూప్రాశి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆంధ్రా చాంబర్ ఆఫ్ కామర్స్, నెదర్లాండ్స్కు చెందిన ఎఫ్ఎస్ఎస్సీ అనే సర్టిఫికేషన్ సంస్థ సహకారంతో సోషల్ మేనేజ్మెంట్ సిస్టమ్ స్టాండర్డ్స్తో గ్లోబల్ ట్రస్ట్ బిల్డింగ్పై ఎఫ్ఎస్ఎస్సీ సమ్మిట్ను శుక్రవారం నిర్వహించింది. ఆంధ్రా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ ఎస్. నరసింహన్, ఎఫ్ఎస్ఎస్సీ నెదర్లాండ్స్ మార్కెట్ డెవలప్మెంట్ డైరెక్టర్ కొలిన్ మోర్గాన్ పాల్గొన్నారు. ఆంధ్రా చాంబర్ వైస్ ప్రెసిడెంట్ ఎస్. నరసింహన్ పారిశ్రామిక పురోగతిలో స్థిరమైన అభివద్ధి, పర్యావరణ బాధ్యత పాత్రను వివరించారు. ఐఏఎస్ అధికారి ఆర్ సెల్వం కొఠారి ఇండస్ట్రియల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ జె రఫీక్ అహ్మద్, పారిశ్రామిక వేత్త నల్లి కుప్పస్వామి శెట్టి పాల్గొన్నారు.