
రైలు ప్రమాదానికి కుట్ర?
● సిగ్నల్ సమస్యతో తప్పిన ప్రమాదం ● రైల్వే ఐజీ ఆధ్వర్యంలో దర్యాప్తునకు మూడు ప్రత్యేక బృందాలు ● తిరువలంగాడు రైల్వేస్టేషన్ వద్ద పట్టాల్లో జాయింట్లో ఊడిన బోల్టులు
తిరుత్తణి: చైన్నె–అరక్కోణం రైలు మార్గంలో తిరువలంగాడు రైల్వేస్టేషన్ సమీపంలో సిగ్నల్ పాయింట్ వద్ద కప్లింగ్లో ఊడిపడిడంతో సిగ్నల్ లేక ఎక్స్ప్రెస్ రైలు ఆగడంతో పెనుప్రమాదం తప్పింది. రైలు ప్రమాద కుట్రకు సంబంధించి రైల్వే ఐజీ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నారు. చైన్నె సెంట్రల్ రైల్వేస్టేషన్ నుంచి అరక్కోణం మార్గంలో గురువారం అర్ధరాత్రి 1.15 గంటలకు ముంబయి మెయిల్ చైన్నె సెంట్రల్ నుంచి ముంబయికి బయల్దేరింది. అరక్కోణం రైల్వేస్టేషన్ జంక్షన్కు రాత్రి 2.10 గంటలకు చేరుకోవాల్సి వుంది. అయితే తిరువలంగాడు స్టేషన్కు సమీపంలోని అరిచంద్రాపురం వద్ద సిగ్నల్ లేక ఆ రైలు ఆగింది. వెంటనే స్టేషన్ లైన్మన్ సిగ్నల్ వున్న ట్రాకు వద్ద వెళ్లి చూడగా మెయిన్ లైన్లో సిగ్నల్ జాయింట్లో క్లప్లింగ్ పాయింట్ రాడ్లు, బోల్టు ఊడి వుండడడంతో వెంటనే అరక్కోణం రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటన ప్రాంతం చేరుకున్న రైల్వే పోలీసులు రైళ్ల సేవలకు అంతరాయం కలగకుండా ట్రాకు మళ్లించి రైళ్లు నెమ్మదిగా వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు.
రైల్వే ఐజీ ఆధ్వర్యంలో తనిఖీ
ఎక్స్ప్రెస్ రైలు కూల్చే కుట్రగా భావిస్తున్న క్రమంలో సదరన్ రైల్వే భద్రతా విభాగం ఐజీ ఈశ్వరరావు ఆధ్వర్యంలో చైన్నె డీఆర్ఎం విశ్వనాఽథ్ ఇరయన్, చైన్నె డివిజన్ ఐజీ బాబు బృందం మెయిన్ ట్రాకులో రెండు చోట్ల కప్లింగ్ పాయింట్లో బోల్టులు, నట్లు కూల్చివేతకు సంబంధించి పరిశీలించి విచారణ చేపట్టారు. అలాగే వేలిముద్ర నిపుణులు, డాగ్ స్క్వాడ్ బృందం తనిఖీలు చేపట్టారు. దర్యాప్తునకు మూడు ప్రత్యేక బృందాలు నియమించినట్లు చైన్నె డీఆర్ఎం తెలిపారు. మెయిన లైన్లో రెండు చోట్ల కప్లింగ్లో సిగ్నల్స్కు సంబంధించిన బోల్టులు, నట్లు ఊడిపడిన స్థలంలో రైల్వే సిబ్బంది మరమ్మతులు చేసి ఉదయం 10 గంటల తర్వాత యథవిధిగా రైళ్లు నడిచాయి.

రైలు ప్రమాదానికి కుట్ర?