
శింబు అడిగితే కాదనగలనా!
తమిళసినిమా: నటుడు శింబు తాజాగా నటిస్తున్న చిత్రాలు లైనప్ అవుతున్నాయి. ఈయన కమలహాసన్తో కలిసి మణిరత్నం దర్శకత్వంలో నటించిన థగ్ లైఫ్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూన్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. కాగా తాజాగా తన 49వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి రామ్కుమార్ బాలకృష్ణన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇకపోతే నటుడు సంతానం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. టీవీ కార్యక్రమాల నుంచి కేరీర్ను ప్రారంభించి, ఆ తరువాత చిత్ర రంగ ప్రవేశం చేశారు. మొదట్లో కమెడియన్గా నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సంతానం ఆ తరువాత కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం ఈయన కథానాయకుడిగా నటించిన డీడీ నెక్ట్స్ లెవెల్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే నెల 16వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. కాగా పలు చిత్రాల్లో కథానాయకుడిగా నటించిన సంతానం ఇప్పుడు మళ్లీ తన పంచ్ డైలాగ్స్ తో అలరించడానికి హాస్య పాత్రలో నటించడానికి రెడీ అవుతున్నారు. నటుడు శింబు హీరోగా నటించనున్న ఆయన 49వ చిత్రంలో సంతానం హాస్య పాత్రలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఆయనే ఒక భేటీలో చెప్పారు. నటుడు శింబు ఫోన్ చేసి తన చిత్రంలో నటిస్తారా? అని అడిగారన్నారు. ఆయన అడిగితే నటించను అని చెప్పగలవా? వెంటనే ఒకే చెప్పానన్నారు. కాగా శింబు, సంతానం కలిసి ఇంతకు ముందు వాలు, వానం, ఓస్తీ, సిలంబాట్టం చిత్రాల్లో నటించారన్నది గమనార్హం. కాగా తాజాగా శింబు హీరోగా నటిస్తున్న చిత్రంలో నటించడానికి సంతానం భారీ మొత్తంలో పారితోషకం పుచ్చుకుంటున్నారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.