గుర్తింపు కార్డు ఉన్నవారికే అనుమతి | - | Sakshi
Sakshi News home page

గుర్తింపు కార్డు ఉన్నవారికే అనుమతి

Apr 25 2025 8:26 AM | Updated on Apr 25 2025 8:26 AM

గుర్తింపు కార్డు ఉన్నవారికే అనుమతి

గుర్తింపు కార్డు ఉన్నవారికే అనుమతి

● శరవేగంగా బూత్‌ కమిటీ మహానాడు పనులు ● కార్డులను పంపిణీ చేసిన టీవీకే ప్రధాన కార్యదర్శి

సాక్షి, చైన్నె: బూత్‌ కమిటీమహానాడుకు హాజరయ్యే వారికి గుర్తింపు కార్డులను తమిళ వెట్రి కళగం పంపిణీ చేస్తోంది. కోయంబత్తూరులో ఈ పంపిణీని గురువారం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్‌ ప్రారంభించారు. ఈ మహానాడు ఏర్పాట్లను వేగవంతం చేశారు. వివరాలు.. రాజకీయ ప్రయాణంలో తదుపరి అడుగు వేయడానికి తమిళ వెట్రి కళగం నేత విజయ్‌ సిద్ధమైన విషయం తెలిసిందే. కోయంబత్తూరు వేదికగా ఈనెల 26,27 తేదిలలో బూత్‌ కమిటీ మహానాడుకు రెడీ అయ్యారు. కోయంబత్తూరు కురుంబం పాలయంలోని ఓ ప్రైవేటు కళాశాల వేదికగా కొంగు మండలంలోని కోయంబత్తూరు, తిరుప్పూర్‌, ఈరోడ్‌, కరూర్‌, సేలం, నామక్కల్‌ తదితర జిల్లాలోని బూత్‌ కమిటీలతో సమావేశానికి చర్యలు తీసుకున్నారు. రెండు రోజుల మహానాడుకు బూత్‌ కమిటీలకు చెందిన 16 వేల మందిని ఆహ్వానించి ఉన్నారు. వీరందరితో విజయ్‌ మాట్లాడనున్నారు. వారికి పలు సూచనలు ఇవ్వనున్నారు. ఈ మహానాడు కుహాజరయ్యే వారందరికి గుర్తింపు కార్డులను సిద్ధం చేశారు. ఈకార్డులు ఉన్న వారిని మాత్రమే లోనికి అనుమతించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ కార్డులను పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్‌ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొంగు మండలంలోని జిల్లాలకు చెందిన తమిళగ వెట్రి కళగం నేతలు సంపత్‌కుమార్‌, బాలాజీ, మదియా జగన్‌, విఘ్నేష్‌, రాజ్‌కుమార్‌, బాలమురుగన్‌, వెంకటేష్‌, యువరాజ్‌, తిరుమలై, వెంకటేష్‌, ేమణికందన్‌, సెంథిల్‌ కుమార్‌, సెల్వం, ప్రదీప్‌ తదితరులు పాల్గొన్నారు. తమ తమపరిధిలోని బూత్‌ కమిటీల ప్రతినిధులకు వీరు గుర్తింపు కార్డులను అందజేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement