● సాగరంలో రెస్క్యూ డ్రిల్‌ | - | Sakshi
Sakshi News home page

● సాగరంలో రెస్క్యూ డ్రిల్‌

Apr 25 2025 8:24 AM | Updated on Apr 25 2025 8:24 AM

● సాగ

● సాగరంలో రెస్క్యూ డ్రిల్‌

సాక్షి,చైన్నె: ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ రీజినల్‌ హెడ్‌ క్వార్టర్స్‌ (తూర్పు) విభాగం నేతృత్వంలో కారైకల్‌ తీరంలో ప్రాంతీయ స్థాయి సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఎక్సర్‌సైజ్‌ విజయవంతంగా నిర్వహించారు. నాగపట్నం నుంచి ప్రయాణీకులతో బయలు దేరిన శివగంగై నౌక సముద్రంలో ప్రమాదానికి గురైన సమాచారంతో ఈ రెస్క్యు డ్రిల్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కారైకల్‌ జిల్లా సోమ శేఖర్‌ అప్పారావు, నాగపట్నం జిల్లా కలెక్టర్‌ ఆకాష్‌,లు హాజరయ్యారు.శివగంగై నౌకలో మంటలు చెలరేగడం, ఫలితంగా అనేక మంది ప్రాణనష్టం సంభవించడం , తక్షణ రెస్క్యూ ఆపరేషర్లకు అవసరమైన కార్యాచరణతో ఈ డ్రిల్‌ జరిగింది. మారిటైమ్‌ రెస్క్యూ కోఆర్డినేషన్‌ సెంటర్‌ , ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ నౌకలు, హెలికాఫ్టర్లు , రెస్యూ బృందాలు కారైక్కాల్‌కు సమీపంలోని నడీ సముద్రంలోకి దూసుకెళ్తాయి. భారత నావికాదళం, మైలాడుతురై,నాగపట్నం, కారైక్కాల్‌ నుంచి వచ్చిన సహాయక బృందాలు ఈ డ్రిల్‌లోభాగస్వాములయ్యాయి. కోస్ట్‌ గార్డ్‌ డిస్ట్రిక్ట్‌ హెడ్‌ క్వార్టర్స్‌ నెం.13 కమాండర్‌ డిప్యూటీ ఇన్స్పెక్టర్‌ జనరల్‌ ఎస్‌ఎస్‌ దాసిలా ఈ డ్రిల్‌ను పర్యవేక్షించారు.

● సాగరంలో రెస్క్యూ డ్రిల్‌1
1/3

● సాగరంలో రెస్క్యూ డ్రిల్‌

● సాగరంలో రెస్క్యూ డ్రిల్‌2
2/3

● సాగరంలో రెస్క్యూ డ్రిల్‌

● సాగరంలో రెస్క్యూ డ్రిల్‌3
3/3

● సాగరంలో రెస్క్యూ డ్రిల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement