నవోదయకు నాంది | - | Sakshi
Sakshi News home page

నవోదయకు నాంది

Jun 18 2025 3:53 AM | Updated on Jun 18 2025 3:53 AM

నవోదయ

నవోదయకు నాంది

ఉపాధిలో దివ్యాంగులకు ప్రాధాన్యం

బుధవారం శ్రీ 18 శ్రీ జూన్‌ శ్రీ 2025

సూర్యాపేట టౌన్‌: జిల్లా కేంద్రంలో జవహర్‌ నవోదయ విద్యాలయం తరగతులను తాత్కాలికంగా ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గత ఏడాది జిల్లాకు నవోదయ విద్యాలయాన్ని కేంద్రం మంజూరు చేయగా శాశ్వత భవన నిర్మాణానికి కోదాడలో ప్రభుత్వ స్థలాన్ని అధికారులు గుర్తించిన విషయం విదితమే. కాగా ఈ విద్యాసంవత్సరం(2025–26) నుంచి శ్రీకారం చుట్టేందుకు సూర్యాపేట పట్టణంలోని రెడ్డి హాస్టల్‌ భవనంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆరో తరగతిలో ప్రవేశాల కోసం పరీక్షసైతం నిర్వహించారు. వచ్చే నెల 14 న తరగతులు ప్రారంభించేలా ప్రణాళిక రూపొందించారు.

శాశ్వత భవన నిర్మాణానికి

కోదాడలో స్థలం గుర్తింపు

సూర్యాపేట జిల్లాకు జవహర్‌ నవోదయ విద్యాలయాన్ని మంజూరు చేస్తూ గత ఏడాది డిసెంబర్‌ 6న కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనేపథ్యంలో అధికారులు విద్యాలయ శాశ్వత భవన నిర్మాణానికి స్థలం కోసం అన్వేషణ చేశారు. మొదట గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో 25 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. కానీ అది స్కూల్‌ భవన నిర్మాణానికి అనుకూలంగా లేదు. దీంతో కోదాడ కేఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీకాలేజీ స్థలంలో నిర్మించడానికి కలెక్టర్‌, ఆర్టీఓ నేతృత్వంలో 19 ఎకరాలను గుర్తించి సెంట్రల్‌ కమిటీ కి నివేదిక పంపించారు. ఆ కమిటీ కూడా ఈ స్థలాన్ని పరిశీలించి వెళ్లింది.

అన్ని వసతులతో..

ఈ విద్యాసంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించాలని ఆదేశాలు రావడంతో జిల్లా కేంద్రంలో తాత్కాలికంగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. దీని కోసం జిల్లా కేంద్రంలోని రెడ్డి హాస్టల్‌ భవనంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో హాస్టల్‌, తరగతి గదుల్లో ఫర్నిచర్‌, ఇతర మెటీరియల్‌ అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులు భోజనం చేసేందుకు మెస్‌ హాల్‌, బాత్రూంలు, టాయిలెట్లు, బెడ్స్‌లు సిద్ధం చేస్తున్నారు.

కార్పొరేట్‌ స్థాయిలో విద్యా ప్రమాణాలు..

జవహర్‌ నవోదయ విద్యాలయం అంటేనే కార్పొరేట్‌ స్థాయిలో విద్య ఉంటుంది. ఈనవోదయ విద్యాలయంలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యనందించనున్నారు. అయితే ఇందులో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు చదువుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ విద్యా సంవత్సరం ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పించనున్నారు. ఇప్పటికే అర్హత పరీక్ష సైతం నిర్వహించారు. మెరిట్‌ ఆధారంగా విద్యార్థుల అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో 40 మంది విద్యార్థులను చేర్చుకోనున్నారు. ఈ నూతన విద్యా సంవత్సరాన్ని జూలై 14న అట్టహాసంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇందులో బోధించేందుకు అవసరమైన బోధన, బోధనేతర సిబ్బందిని కేటాయించారు.

న్యూస్‌రీల్‌

ఫ సూర్యాపేటలో తాత్కాలిక భవనంలో జవహర్‌ నవోదయ విద్యాలయం

ఫ ఈ విద్యాసంవత్సరం నుంచి శ్రీకారం చుట్టేలా రెడ్డి హాస్టల్‌లో ఏర్పాట్లు

ఫ 6వ తరగతిలో 40మంది

విద్యార్థులకు ప్రవేశాలు

ఫ జూలై 14న తరగతులు

ప్రారంభించేలా సన్నాహాలు

ఫ శాశ్వత భవన నిర్మాణానికి కోదాడలో 19ఎకరాల స్థలం గుర్తింపు

నవోదయకు నాంది1
1/2

నవోదయకు నాంది

నవోదయకు నాంది2
2/2

నవోదయకు నాంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement