మట్టపల్లి క్షేత్రంలో నిత్యకల్యాణం | - | Sakshi
Sakshi News home page

మట్టపల్లి క్షేత్రంలో నిత్యకల్యాణం

Jun 18 2025 3:53 AM | Updated on Jun 18 2025 3:53 AM

మట్టపల్లి క్షేత్రంలో నిత్యకల్యాణం

మట్టపల్లి క్షేత్రంలో నిత్యకల్యాణం

మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో మంగళవారం శ్రీరాజ్యలక్ష్మిచెంచులక్ష్మిసమేత శ్రీలక్ష్మీనరసింహ స్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఆలయంలో సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, ఎదుర్కోళ్లమహోత్సవ సంవాదం చేపట్టారు. కల్యాణవేడుకలో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మదుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలు కార్యక్రమాలు జరిపించారు. గరుడవాహనంపై స్వామివారిని తిరుమాడవీధుల్లో ఊరేగించారు.

శ్రీసుబ్రహ్మణ్య స్వామి కల్యాణం

మట్టపల్లి క్షేత్రంలోని శివాలయంలో శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యస్వామి కల్యాణాన్ని మంగళవారం అర్చకులు నిర్వహించారు. గణపతిపూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణతంతు ముగించారు. ఈకార్యక్రమంలో విజయ్‌కుమార్‌, మట్టపల్లిరావు, నవీన్‌కుమార్‌, శ్రీనివాసాచార్యులు, పద్మనాభా చా ర్యులు, బదరీనారాయణాచార్యులు, లక్ష్మీనరసింహ మూర్తి, ఫణిభూషణ మంగాచార్యులు , ఆంజనేయాచార్యులు, శేషగిరిరావు, దుర్గాప్రసాద్‌శర్మ, సీతారామాచార్యులు, సుబ్రహ్మణ్యం, రాజేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement