
యూరియా కోటాలో కోత!
భానుపురి, గుర్రంపోడు : యూరియా కోటాను కేంద్రం తగ్గిస్తోంది. రైతులు అధిక మోతాదులో యూరియా వాడకాన్ని తగ్గించేలా.. రాయితీపై అందిస్తున్న యూరియా పక్కదాటి పట్టకుండా చర్యలు తీసుకుంటోంది. అయితే.. కేంద్రం తీసుకుంటున్న చర్యలతో భవిష్యత్లో యూరియా కష్టాలు ఎదురయ్యేలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో వానాకాలంలో సాగయ్యే అన్ని పంటలకు కలుపుకుని 60,731 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా కానీ 30 శాతం తక్కువగా యూరియా కేటాయిస్తున్నారు. అయితే జిల్లాలో ఇప్పటివరకు 28,256 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. అయితే జూలై నుంచి జిల్లాకు సరిపడా కోటా విడుదల అవుతుందా.. లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఓటీపీ, వేలిముద్రతోనే పంపిణీ
వ్యవసాయశాఖ ఇటీవల ఎరువుల డీలర్లకు కొత్త ఈపాస్ యంత్రాలను పంపిణీ చేసింది. యూరియా కొనుగోలు చేసే రైతులు తప్పనిసరిగా తమ సెల్ఫోన్కు వచ్చిన ఓటీపీని డీలర్కు చెప్పడం లేదా వేలిముద్ర వేయడం ద్వారానే యూరియా, ఇతర ఎరువులు కొనాల్సి ఉంటుంది. దీంతో యూరియా పక్కదారి పట్టకుండా పర్యవేక్షణ పక్కాగా ఉండనుంది. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అండగా ఉండేలా.. భారీగా రాయితీతో అందిస్తున్న యూరియా.. పక్కదారి పట్టి రసాయన పరిశ్రమలకు వాడుతుండటం వల్ల రాయితీ దుర్వినియోగం అవుతోంది. దీన్ని నివారించేందుకు ప్రభుత్వం ఇప్పటికే నీమ్ కోటెడ్ యూరియాను వినియోగంలోకి తెచ్చింది.
అధిక మోతాదులో వాడితే నష్టమే..
యూరియాతో పోలిస్తే కాంప్లెక్స్ ఎరువుల ధరలు నాలిగింతలు అధికంగా ఉండటం, రసాయన ఎరువుల వాడకంపై సరైన అవగాహనలేకపోవడం వల్ల రైతులు యూరియాను విచ్చలవిడిగా వినియోగించి నష్టపోతున్నారు. ఎకరా వరికి రెండు బస్తాల యూరియా వాడాల్సి ఉండగా నాలుగు నుంచి ఆరు బస్తాల వరకు వాడుతున్నారు. యూరియాను వాడటం వల్ల పైరు పచ్చగా ఏపుగా ఉంటుంది. అధిక మోతాదులో వేసినప్పుడు తేలికగా నీటిలో కొట్టుకుని పోయి పైరుకు ఉపయోగపడదు. మొక్కలు సుకుమారంగా పెరగడం వల్ల చీడపీడలు, తెగుళ్ల బారిన పడతాయి. దీంతో పెట్టుబడి అధికమవుతుంది. వరి పైరు విపరీతంగా పెరిగి కోత సమయంలో పంట దిగుబడి పడిపోతుంది. పూత ఆలస్యంగా వచ్చి పంట కాలం పొడగించబడి దిగుబడి తగ్గుతుంది. వరిలో పూత దశ తర్వాత యూరియాను వేస్తే బియ్యపు గింజలో పొట్ట తెలుపు వచ్చి నూక ఎక్కువ అవుతుంది. అధిక మొత్తంగా యూరియా వాడకం వల్ల కలిగే అనర్థాలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
సాగు అంచనా
6,17,489 ఎకరాలు
ఫ మోతాదుకు మించి
వాడకుండా చర్యలు
ఫ రాయితీ దుర్వినియోగం
కాకుండా అడ్డుకట్ట
ఫ భవిష్యత్లో పొంచి ఉన్న యూరియా కొరత
ఫ రైతులకు అవగాహన
కల్పిస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు
అవసరమైన యూరియా
60,731 మెట్రిక్ టన్నులు
ఇప్పటివరకు వచ్చింది
28,256 మెట్రిక్ టన్నులు
యూరియా వాడకంలో మెళకువలు
ఫ ద్రవ రూప నానో యూరియా సాధారణ యూరియాతో సమానంగా పనిచేస్తుంది. నానో యూరియాను పిచికారీ చేయడం వల్ల వేగంగా మంచి ఫలితాలు వస్తాయి. రైతుకు బస్తాల భారం తగ్గుతుంది.
ఫ మెట్ట పైర్లలో యూరియా వేసేటప్పుడు నేలలో తేమ ఉండేటట్లు చూసుకోవాలి. మెట్టపైర్లలో యూరియాను చల్లడం కన్నా మొక్క మొదట్లో గుంట తీసి వేస్తే మంచిది.
ఫ పైరుకు సిఫారసు చేసిన యూరియాను రెండు, మూడు దఫాలుగా వేసుకోవాలి.
ఫ యూరియాతోపాటు వేప పిండి (50 కేజీల యూరియాకు 5 కిలోల వేపపిండి) వాడితే నత్రజని మొక్కలకు ఎక్కువ కాలం అంది చీడపీడల వ్యాప్తి తగ్గుతుంది.
ఫ పైరును బట్టి సేంద్రియ ఎరువులు, రైబోజియం మొదలగు జీవన ఎరువులు వాడి యూరియా మోతాదును తగ్గించుకోవచ్చు.
ఫ కాంప్లెక్స్ ఎరువుల్లో కూడా నత్రజని ఉంటున్నందున యూరియాను మరీ ఎక్కువగా జోడించి వాడకూడదు.