ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి

Jun 17 2025 4:53 AM | Updated on Jun 17 2025 4:53 AM

ప్రభుత్వ పథకాలు  వినియోగించుకోవాలి

ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి

చివ్వెంల(సూర్యాపేట) : ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ కోరారు. హైదరాబాద్‌ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం రైతునేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించి వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించగా చివ్వెంల మండల పరిధిలోని గాయంవారిగూడెంలోని రైతు వేదికలో రైతులు, అధికారులతో కలిసి కలెక్టర్‌ వీక్షించి మాట్లాడారు. రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. సీఎం సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతు భరోసా పెట్టుబడితో రైతులు ఆన్ని రకాల పంటలు సాగు చేసకోవాలని సూచించారు. ఆదర్శ రైతులచే జిల్లాలోని రైతు వేదికల్లో వ్యవసాయ సాగు విధానాలపై వారి అనుభవాలు పంచకునే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో ఎస్పీ నరసింహ, మార్కెట్‌కమిటీ చైర్మన్‌ కొప్పుల వేణారెడ్డి, మండల ప్రత్యేకాధికారి జగదీష్‌ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌ రెడ్డి, తహసీల్దార్‌ ప్రకాశ్‌రావు, ఏఓ వెంకటేశ్వర్లు, ఏఈఓ శైలజ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement