ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల

Jun 17 2025 4:53 AM | Updated on Jun 17 2025 4:53 AM

ఇంటర్

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల

సూర్యాపేటటౌన్‌ : ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. మొదటి సంవత్సరం జనరల్‌ విభాగంలో 4,177 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,725 మంది పాసై 65.24శాతం ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్‌ విభాగంలో 707మంది విద్యార్థులకు గాను 455 మంది విద్యార్థులు పాస్‌ కాగా 64.36శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే ద్వితీయ సంవత్సరంలో 2,132 మంది విద్యార్థులకు గాను 1,447 మంది విద్యార్థులు పాసై 67.87శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే ఒకేషనల్‌ విభాగంలో 480 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 345 మంది పాసై 71.88శాతం ఉత్తీర్ణత సాధించారు.

బాధితులకు

అండగా ఉండాలి

సూర్యాపేటటౌన్‌ : ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ బాధితులకు పోలీసులు అండగా ఉండాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ సూచించారు. సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులతో మాట్లాడి వారి ఫిర్యాదులు స్వీకరించి మాట్లాడారు. పిర్యాదుదారులకు భరోసా కల్పించాలని, ప్రతి అంశాన్ని చట్ట పరిధిలో పరిష్కరించడంలో, బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని పోలీస్‌ అధికారులను ఆదేశించారు.

పాఠశాలల్లో విద్యార్థుల

సంఖ్య పెంచాలి

ఆత్మకూర్‌(ఎస్‌)(సూర్యాపేట): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని జిల్లా విద్యాధికారి అశోక్‌ ఆదేశించారు. సోమవారం ఆత్మకూర్‌(ఎస్‌) జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, ప్రాథమికపాఠశాల, కేజీబీవీని ఆయన తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించి మాట్లాడారు. తల్లిదండ్రులు తమపిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని కోరారు. కేజీబీవీలో విద్యార్థినులు పూర్తిస్థాయిలో రాలేదని తల్లిదండ్రులతో మాట్లాడి వెంటనే రప్పించాలన్నారు. కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రవణ్‌ కుమార్‌, ప్రాథమికపాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వనజ, కేజీబీవీ ఎస్‌ఓ సరస్వతి పాల్గొన్నారు.

ఫాసిస్టు విధానాలు

అనుసరిస్తున్న కేంద్రం

సూర్యాపేట : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతం, కులం పేరుతో ప్రజలను విడదీస్తూ, ఫాసిస్టు విధానాలను అనుసరిస్తోందని ట్రేడ్‌ యూనియన్‌ సెంటర్‌ ఆఫ్‌ ఇండియా (టీయూసీఐ) జిల్లా అధ్యక్షుడు గొడ్డలి నర్సయ్య పేర్కొన్నారు. నిజామాబాద్‌లో ఈ నెల 21, 22 తేదీల్లో నిర్వహించే టీయూసీఐ రాష్ట్ర ప్రథమ మహాసభల పోస్టర్లను సోమవారం సూర్యాపేటలో ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో గోగుల వీరబాబు, ఐతరాజు వెంకన్న, సాహెబ్‌ హుస్సేన్‌, జక్కుల శేషగిరి, శ్రీను,నగేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్‌ సప్లిమెంటరీ  పరీక్ష ఫలితాలు విడుదల1
1/1

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement