ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి

Jun 17 2025 4:53 AM | Updated on Jun 17 2025 4:53 AM

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి

భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణి దరఖాస్తులను అధికారులు సత్వరం పరిష్కరించాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ కోరారు.సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకొని మాట్లాడారు. దరఖాస్తులను కూలంకషంగా పరిశీలించి వాటిని పెండింగ్‌లో ఉంచకుండా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌ నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి మూడు రోజుల్లో పరిష్కారం చూపాలని, ఆ తర్వాత నివేదికలు అందజేయాలని ఆదేశించారు. ప్రజావాణిలో 102 దరఖాస్తులు వచ్చాయని, వాటిని సంబంధిత శాఖల అధికారులకు పరిష్కారం నిమిత్తం పంపినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ పి.రాంబాబు, డీఆర్‌డీఓ వివి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement