శాస్త్రోక్తంగా నిత్య కల్యాణం | - | Sakshi
Sakshi News home page

శాస్త్రోక్తంగా నిత్య కల్యాణం

Apr 12 2025 2:07 AM | Updated on Apr 12 2025 2:07 AM

శాస్త్రోక్తంగా నిత్య కల్యాణం

శాస్త్రోక్తంగా నిత్య కల్యాణం

మఠంపల్లి : జిల్లాలో ప్రసిద్ధిగాంచిన మట్టపల్లిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి మహాక్షేత్రంలో శుక్రవారం శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సుప్రభాతసేవ, నిత్య అగ్నిహోత్రి, పంచామృతాలతో అభిషేకం, అష్టోత్తర సహస్ర నామార్చలు గావించారు. నూతన పట్టు వస్త్రాలంకరణతో స్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవాన్ని రక్తికట్టించారు. అనంతరం , మాంగల్యధారణ, తలంబ్రాలతో వేదమంత్రోచ్ఛరణాలతో వైభవంగా నిర్వహించారు. సాయంత్రం కృష్ణానదికి అర్చకులు హారతి ఇచ్చారు. కార్యక్రమంలో అర్చకులు తూమాటి కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనర్సింహమూర్తి, ఆంజనేయచార్యులు, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement