ఆర్థిక సమస్యలతో ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక సమస్యలతో ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య

Apr 8 2025 7:07 AM | Updated on Apr 8 2025 7:07 AM

ఆర్థి

ఆర్థిక సమస్యలతో ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య

నాగార్జునసాగర్‌: ఆర్థిక సమస్యలతో మనస్తాపానికి గురైన ప్రభుత్వ ఉద్యోగి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్‌కాలనీలో జరిగింది. ఎస్‌ఐ సంపత్‌గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హిల్‌కాలనీకి చెందిన నెల్లం శ్రీనివాసరావు డిండి మండలంలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఆయన అనారోగ్య, ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆయన సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య విజయశ్రీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఎయిమ్స్‌లో

పీడియాట్రిక్‌ సర్జరీ డే

బీబీనగర్‌ : మండల కేంద్రంలోని ఎయిమ్స్‌ వైద్య కళాశాలలో సోమవారం వరల్డ్‌ పీడియాట్రిక్‌ సర్జరీ డే ఘనంగా నిర్వహించారు. పీడియాట్రిక్‌ వైద్య విభాగంలో చికిత్స పొందడానికి వచ్చిన చిన్నారులతో కలిసి డైరెక్టర్‌ వికాస్‌ భాటియా, వైద్యులు కేక్‌ కట్‌ చేశారు. చిన్నారుల ఆరోగ్య విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. చిన్నారులకు ఆరోగ్య సమస్యలు ఉంటే సంప్రదించాలన్నారు. ఆధునిక సర్జరీ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు వికాస్‌ భాటియా తెలిపారు.

ఆర్థిక సమస్యలతో  ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య1
1/1

ఆర్థిక సమస్యలతో ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement