23న యువత పోరులో గళమెత్తుదాం | - | Sakshi
Sakshi News home page

23న యువత పోరులో గళమెత్తుదాం

Jun 21 2025 3:47 AM | Updated on Jun 21 2025 3:47 AM

23న యువత పోరులో గళమెత్తుదాం

23న యువత పోరులో గళమెత్తుదాం

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): కూటమి పార్టీలు ఎన్నికల ముందు యువతకు, విద్యార్థులకు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించడం సరికా దని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం పార్లమెంట్‌ పరిశీలకుడు కుంభా రవిబాబు అన్నారు. ఫీజు రీ యింబర్స్‌మెంట్‌కు రూ.4200 కోట్లు, వసతి దీవెన కు రూ.2200 కోట్లు అవసరమైతే కనీసం సగం ని ధులు కూటా కేటాయించకపోవడం దారుణమన్నా రు. ఇంజినీరింగ్‌, డిగ్రీ కాలేజీల్లో విద్యార్థులు ఫీజు లు కట్టలేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ నెల 23న నిర్వహించనున్న యువత పోరు కార్యక్ర మం విజయవంతం చేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో పోస్టర్‌ ఆవిష్కరించారు.

పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ మాట్లాడుతూ విద్యార్థుల్ని, యువతను మోసం చేసిన చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లకు తగిన బుద్ధి చెప్పేందు కు ఈ నెల 23న నిర్వహించబోయే ‘యువత పోరు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లాలో యువత, విద్యార్థులకు పిలుపునిచ్చారు. నిరుద్యోగులకు ఇవ్వాల్సిన భృతి, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకుంటే భవిష్యత్‌లో ఉద్యమించక తప్పదన్నారు.

మాజీ మంత్రి, పార్టీ డాక్టర్స్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని ప్రగల్బాలు పలికే పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలపై ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నా రు. చంద్రబాబు మోసాలు, పవన్‌కల్యాణ్‌ ప్రశ్నించే గొంతు మూగబోయిందన్న విషయం ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. మొన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చినప్పుడు టీడీపీకి చెందిన వారే రప్పా రప్పా అంటూ ప్లకార్డులతో వస్తే దాన్ని వైఎస్సార్‌సీపీ వాళ్లపై ఆపాదించడం దారుణమన్నారు.

ఈ సందర్భంగా యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవీ స్వరూప్‌ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 1.90కోట్ల మంది నిరుద్యోగులకు రూ.3వేలు చొప్పున బకాయి పడ్డారన్నారు. కార్యక్రమంలో పా తపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, పార్టీ తూర్పుకాపు, కాళింగ, కళింగవైశ్య కుల రాష్ట్ర అధ్యక్షులు మామిడి శ్రీకాంత్‌, దుంపల లక్ష్మణరావు, అంధవ రపు సూరిబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీజీ సత్యనారాయణ, టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్‌, ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమా ర్‌, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మార్పు పృథ్వీ, జెడ్పీటీసీ రుప్ప దివ్య, గ్రీవెన్స్‌సెల్‌ జిల్లా అధ్య క్షులు రౌతు శంకరరావు, అంబటి శ్రీనివాసరావు, గొండు కృష్ణమూర్తి, యువజన విభాగం నగర, ని యోజకవర్గ అధ్యక్షులు గుండ భాస్కర్‌, భరద్వాజ్‌, నక్క రామరాజు, పిల్లల రామకృష్ణ, సీపాన వెంకటరావు, టి.కామేశ్వరి, మట్ట నీలంయాదవ్‌, సీపానా రామారావు, మూకళ్ల తాతబాబు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ, వైఎస్సార్‌ సీపీ శ్రీకాకుళం పార్లమెంట్‌ పరిశీలకుడు కుంభా రవిబాబు పిలుపు

చంద్రబాబు యువతకు న్యాయం చేయాలి: ధర్మాన కృష్ణదాస్‌

20 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి? : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు

యువత పోరు పోస్టర్‌ ఆవిష్కరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement