
●23 ఏళ్లుగా..
నేను 23 ఏళ్లుగా యోగాభ్యాసం చేస్తున్నాను. శ్రీకాకుళంలోని యోగాచార్య రామారావు వద్ద యోగా నేర్చుకున్నా ను. తర్వాత బెంగళూరు అంతర్జాతీయ యోగా యూనివర్సిటీలో డిప్లమో చేశాను. నా శిష్యులు కూడా చాలా యోగా కేంద్రాలను నిర్వహిస్తున్నారు. – మావురి నాగేశ్వరరావు, యోగా గురువు
●మహిళలకు ఉచితంగా యోగా
ఇక్కడ కేవలం మహిళలకు మాత్రమే ఉచితంగా నేర్పుతున్నాను. ఈ పార్కులో ఉదయం 5గంటల నుంచి యోగాభ్యాసం జరుగుతుంది. కొన్ని ఆసనాలు ప్రదర్శించడం ద్వారా 16 ఏళ్ల వయసు నుంచి తరచూ వచ్చే పీరియడ్స్ సమస్యలు కూడా తొలగిపోతాయి.
– పిండి శారద, ఎల్బీఎస్ కాలనీ యోగా కేంద్రం