
చిన్నతనంలో ఆడుతూ పాడుతూ తిరిగే అల్లరి పిల్లల్ని మందలించ
● విద్యతో పాటు సంగీతం నేర్చుకోవడంపై ఆసక్తి పెంచుకుంటున్న చిన్నారులు
● అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్న సీనియర్ కళాకారులు
● నేడు ప్రపంచ సంగీత దినోత్సవం
శ్రీకాకళం కల్చరల్/కవిటి/ఇచ్ఛాపురం:
ఒత్తిడితో కూడిన జీవనానికి సంగీతం సాంత్వన కలిగిస్తుంది. మనస్సును ఆహ్లాదపరుస్తుంది. మానసిక ఆందోళనతో ఉండేవారికి ఔషధంలా పనిచేస్తుంటుంది. అందుకే సంగీతానికి ఎప్పటికీ ఆదరణ కొనసాగుతునే ఉంటుంది. నాటితరమే కాకుండా నేటి యువతరం కూడా సంగీతంపై మక్కువ పెంచుకుంటోంది. క్రమం తప్పకుండా సాధన చేస్తూ వాయిద్యాలపై పట్టు సాధిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా అనేక చోట్ల సంగీత శిక్షణ కేంద్రాల్లో చిన్నారులు తర్ఫీదు పొందుతున్నారు.
అనురాగ నిలయంలో..
జిల్లా కేంద్రంలోని అనురాగ నిలయంలో రెడ్క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు సూచనల మేరకు చిన్నారులకు రెడ్డి సత్యనారాయణ నేతృత్వంలో సంగీతం తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక్కడి అనాథ చిన్నారులు వేదికపై ప్రదర్శనలు కూడా ఇచ్చే స్థాయికి చేరుకున్నారు. తల్లిదండ్రులు లేనివారిని అక్కున చేర్చుకుని బాగోగులు చూడటంతో పాటు వారి అభిరుచి మేరకు సంగీతం నేర్పిస్తుండటంతో సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
వైద్యం.. సంగీతం
ఓవైపు వైద్య వృత్తిలో ఎంత బిజీగా ఉన్నా సంగీత రంగంలోనూ రాణిస్తున్నారు జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ చిట్టి రామకృష్ణ. ప్రస్తుతం పాలకొండ ఏరియా ఆసుపత్రిలో నేత్రవైద్యులుగా పనిచేస్తున్న ఈయన వీణా వాయిద్యంలో అద్భుత ప్రద ర్శనతో ఆకట్టుకుంటున్నారు. విజయనగరం సంగీ త కళాశాలలో సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసి ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా కెనడా, మలేషియా, బెంగళూరు లోని విద్యార్థులు సంగీత తరగతులు నిర్వహిస్తున్నారు. ఇతని సతీమణి శ్రీసౌమ్య రేడియేషన్ అంకాలజిస్టుగా జెమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. ఆది త్యా మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో మిస్టర్ లోన్ లీ సినిమాకు వీణ ప్రదర్శన చేశారు. ఆల్ ఇండియా రేడియో ఏ–గ్రేడ్ ఆర్టిస్టుగా నమోదయ్యారు. ఎస్బీవీసీ ఛానల్లో కూడా వీణ ప్రదర్శన ఇచ్చారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ పోటీల్లో ప్రథమ బహుమతి సాధించారు.
తండ్రి స్ఫూర్తితో..
తన తండ్రి బండారు చిట్టిబాబు స్ఫూర్తితో తనకంటూ ప్రత్యేకతను చాటుకోడానికి తబలా విద్యను అభ్యసించారు బండారు రమణముర్తి. సినీ నేపథ్య గాయకులు పి.సుశీల, ఎస్.జానకి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ మంగళం పల్లి బాలమురళీకృష్ణ, లతామంగేష్కర్, సత్యసాయిబాబా తదితర ఉద్ధండులైన గాయనీ గాయకులకు తబలా సహకారాన్ని అందించారు. అనేక టీవీ షోలలో ప్రాతినిధ్యం వహించారు.
బ్యాంకు ఉద్యోగం చేస్తూనే..
నగరానికి చెందిన మండా శ్రీనివాస్ యూనియన్ బ్యాంకులో ఉద్యోగం చేస్తూ మృదంగంలోనూ రాణిస్తున్నారు. ఔత్సాహిక శాసీ్త్రయ, లలిత, సినీ సంగీత కళాకారులందరిని ఒకే వేదికపై ప్రదర్శన అవకాశం కల్పించేందుకు తరుణి కృష్ణస్మారక ధార్మిక ట్రస్టు 2019లో ఏర్పాటు చేసి సంగీత రంగంలో కృషి చేస్తున్నారు.
కీబోర్డు రాజు..
నగరంలొ కీబోర్డు రాజుగా తనకంటూ ప్రత్యేక పేరు సాధించారు ముంజేటి రాజు. బండారు రమణమూర్తి సంగీత సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఢిల్లీ, కోల్కతా, జంషెడ్పూర్, నాగపూర్ వంటి నగరాల్లో సంగీత ప్రదర్శనలు ఇస్తున్నారు. సినీ నేపథ్య గాయకులు గోపికాపూర్ణిమ, మల్లికార్జున్ ప్రోగ్రామ్స్లో కీబోర్డు సహకారం అందించారు.
అమ్మవారి సేవలో..
ఓవైపు రాజరాజేశ్వరీ మహాత్రిపుర సుందరీ దేవిపీఠంలో అమ్మవారి ఉపాసన చేస్తునే మరోవైపు ఆ అమ్మవారి పేరుతో సంగీత విద్యాలయాన్ని నడిపిస్తూ సంగీత సేవలందిస్తున్నారు సుసరాపు లక్ష్మీగణపతి శర్మ. తన తండ్రి దుర్గాప్రసాద్ శర్మను స్ఫూర్తిగా తీసుకొని పీఠాన్ని నిర్వహిస్తునే వైణీకుడిగా, గాయకుడిగా ప్రదర్శనలు ఇస్తూ ఎంతోమంది చిన్నారులకు, యువకులకు సంగీత విద్యను అభ్యసింపజేస్తున్నారు.
శాక్సోఫోన్ శ్రీనివాస్
హయతినగరానికి చెందిన సుందరపల్లి శ్రీనివాస్ శాక్సోఫోన్, క్లారినెట్ ప్రదర్శనలో రాణిస్తున్నారు. కర్నాటక సంగీతంలో దిట్ట. ఇప్పటికీ ప్రతి రోజు ఆరుగంటల పాటు సాధన చేస్తుంటారు. మైసూరు గురుదత్త ఆశ్రమం, విశాఖ, హైదరాబాద్, తిరుపతి తదితర పుణ్యక్షేత్రాల్లో తన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.

చిన్నతనంలో ఆడుతూ పాడుతూ తిరిగే అల్లరి పిల్లల్ని మందలించ

చిన్నతనంలో ఆడుతూ పాడుతూ తిరిగే అల్లరి పిల్లల్ని మందలించ

చిన్నతనంలో ఆడుతూ పాడుతూ తిరిగే అల్లరి పిల్లల్ని మందలించ

చిన్నతనంలో ఆడుతూ పాడుతూ తిరిగే అల్లరి పిల్లల్ని మందలించ

చిన్నతనంలో ఆడుతూ పాడుతూ తిరిగే అల్లరి పిల్లల్ని మందలించ

చిన్నతనంలో ఆడుతూ పాడుతూ తిరిగే అల్లరి పిల్లల్ని మందలించ