మొగదాలపాడులో పూరిల్లు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

మొగదాలపాడులో పూరిల్లు దగ్ధం

Jun 21 2025 2:58 AM | Updated on Jun 21 2025 2:58 AM

మొగదా

మొగదాలపాడులో పూరిల్లు దగ్ధం

గార: వత్సవలస పంచాయతీ మొగదాలపాడులో గనగళ్ల లక్ష్మమ్మకు చెందిన పూరిల్లు అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో విద్యుత్‌ మీటరు వద్ద మంటలు చెలరేగి ఇంటి మొత్తం వ్యాపించాయని బాధితురాలు తెలిపారు. గ్రామస్తులు మంటలార్పే ప్రయత్నం చేసినా ఫలితం దక్క లేదు. శ్రీకాకుళం నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. సుమారు రూ. 2 లక్షలు వరకు ఆస్తి నష్టం ఉంటుందని రెవెన్యూ సిబ్బంది అంచనా వేశారు.

జూలై 9న అఖిలభారత సమ్మె

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): కార్మిక హక్కులు కాలరాసే లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థలు పరిరక్షణ కోరుతూ కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు జూలై 9న అఖిల భారత సమ్మె జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీహెచ్‌.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు పిలుపునిచ్చా రు. ఈ మేరకు శుక్రవారం శ్రీకాకుళం సీఐటీ యూ జిల్లా సమావేశం కార్యాలయంలో సమ్మె పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూలై 9న అన్ని మండల కేంద్రాలలో నిరసన ప్రదర్శనలు జరుగుతాయని, కార్మికులు, స్కీం వర్కర్లు పాల్గొనాలని కో రారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు ఎం.ఆదినారాయణమూర్తి, అల్లు సత్యనారాయణ, కె.సూరయ్య, ఎన్‌.వి.రమణ, ఎన్‌. గణపతి, ఎస్‌.లక్ష్మీనారాయణ, శ్రీకాకుళం నగ ర కన్వీనర్‌ ఆర్‌.ప్రకాశ్‌ పాల్గొన్నారు.

మొగదాలపాడులో పూరిల్లు దగ్ధం   1
1/1

మొగదాలపాడులో పూరిల్లు దగ్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement