
తల్లికి వేదన
ఇచ్ఛాపురం రూరల్: ఎంత మంది చదువుకునే పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం పథకం కింద ఏడాదికి రూ.15వేలు ఇస్తానంటూ గత ఎన్నికల ముందు ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. తీరా గద్దెనెక్కిన తర్వాత తొలి ఏడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాది ప్రారంభమయ్యాక తొలిసారి అమల్లోకి తెచ్చిన తల్లికి వందనాన్ని నిబంధనల చట్రంలో ఇరికించారు. ఆచరణలోకి వచ్చేసరికి కొర్రీలతో కోతలు పెట్టారు. 300 యూనిట్లు విద్యుత్ వినియోగిస్తే అనర్హత వేటు వేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యుత్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. 300 యూనిట్లు కంటే తక్కువ ఉన్నప్పటికీ గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించిన తల్లికి వందనం జాబితాలో అనర్హత ఉండటంతో లబోదిబోమంటున్నారు. తమకు తక్కువ బిల్లు వచ్చినప్పటికీ తల్లికి వందనం పథకంలో తమ పిల్లల పేర్లు అనర్హతగా నమోదయ్యాయని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అటు గ్రామ సచివాలయాలు, ఇటు విద్యుత్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
‘తల్లికి వందనం’ పథకం అందక పాట్లు
కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు