నాణ్యత పరీక్షలపై నీలినీడలు | - | Sakshi
Sakshi News home page

నాణ్యత పరీక్షలపై నీలినీడలు

Jun 17 2025 5:32 AM | Updated on Jun 17 2025 5:32 AM

నాణ్యత పరీక్షలపై నీలినీడలు

నాణ్యత పరీక్షలపై నీలినీడలు

గతంలో అనేకసార్లు సబ్సిడీపై అందించిన విత్తనాలు మొలక శాతంలో తేడాలు రావటంతో రైతులకు రాయితీ విత్తనాలపై నమ్మకం సన్నగిల్లింది. ఈ ఏడాది వ్యవసాయశాఖలో అధికారులు, సిబ్బంది బదిలీలు నేపథ్యంలో ఎక్కడా నాణ్యత పరీక్షలు చేసిన దాఖలాలు లేవు. మండలాల వారీగా టార్గెట్‌ పెట్టి నాణ్యత పరీక్షలు చేయాలి. ప్రైవేటు దుకాణాల్లో కూడా పరీక్షలు చేయాలి. కానీ ఆ స్థాయిలో నాణ్యతా పరీక్షలు జరగలేదని తెలుస్తోంది. ముఖ్యంగా రైతుసేవాకేంద్రాల్లో పంపిణీ చేస్తున్న విత్తనాలను స్థానికంగా శాంపిల్స్‌ తీసి వాటి నాణ్యతను నిరూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడా పని జరగకపోవడంతో విత్తనాలపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనివల్ల విత్తనం నాటిన తర్వాత చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నష్టపరిహారం డిమాండ్‌ చేయటం, మళ్లీ విత్తనాల కోసం ప్రైవేటు దుకాణాల వద్ద క్యూకట్టడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. నష్టపోయాక హడావుడి నాణ్యతపరీక్షలు జరిపి కాకిలెక్కలు చెప్పడం కన్నా ముందే విత్తన నాణ్యత పరీక్షలు చేయాల్సి అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement