
నీలమణిదుర్గకు హైకోర్టు జడ్జి పూజలు
పాతపట్నం: ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవం నీలమణీ దుర్గ అమ్మవారిని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి గేదెల తుషార్రావు సోమవారం దర్శించుకున్నారు. అమ్మవారికి కుంకుమ పూజలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు అశీర్వాదాలు అందజేశారు. ముందుగా ఆలయ మర్యాదలతో ఆలయంలోకి పూర్ణకుంభంతో ఆహ్వానించారు. ఆలయ సిబ్బంది అమ్మవారి చిత్రపటాన్ని జడ్జికి అందజేశారు. ఆయనతో పాటు పాతపట్నం కోర్టు జూనియర్ సివిల్ జడ్జి ఎం.రోషిణి, ఎస్ఐ బి.లావణ్య, ఆలయ గుమస్తా కె.సుదర్శనరావు, అర్చకులు టి.సతీష్, ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.
పురుగుల మందు తాగి
వ్యక్తి మృతి
టెక్కలి రూరల్: మండలంలోని తిర్లంగా గ్రామానికి చెందిన పొందర కోదండరావు(36)అనే తాపీమేసీ్త్ర పురుగుల మందు తాగి మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. మృతుడు గత కొంతకాలంగా మూలవ్యాధితో బాధపడుతున్నాడు. అయితే ఆదివారం ఆ బాధ మరింత ఎక్కువ కావడంతో తట్టుకోలేక పురుగుల మందుతాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు హుటాహూటిన టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం అర్థరాత్రి మృతి చెందినట్లు వెల్లడించారు. మృతుడికి భార్య కృష్ణవేణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
అధికార లాంఛనాలతో
అంత్యక్రియలు
సోంపేట: ఇచ్ఛాపురం రూరల్ పోలీసుస్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదంలో ఇటీవల మరణించిన పొట్టి జగదీష్ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో పూర్తయ్యాయి. మండలంలో ఎర్రముక్కాం గ్రామంలోని శ్మశానవాటికలో అశ్రునయనాలతో సోమవారం పూర్తి చేశారు. కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు, సోంపేట సీఐ బి.మంగరాజు, ఇచ్ఛాపురం రూరల్ ఎస్ఐ శ్రీనివాసరావు మృతదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జగదీష్ మరణం పోలీసు డిపార్ట్మెంట్కు తీరని లోటన్నారు. ఆయన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. జగదీష్ కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేశారు. ఎస్ఐ శ్రీనివాసరావు జగదీష్ పాడెమోసి తన అభిమానాన్ని చాటుకున్నారు. అంతిమయాత్రలో గ్రామంలోని యువత, మహిళలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

నీలమణిదుర్గకు హైకోర్టు జడ్జి పూజలు