ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని చెబుతున్నారు. కానీ ఆ బస్సులు బస్టాండుల్లో తప్ప ఎక్కడా ఆపడం లేదు. ఆటోల్లో బస్టాండు వరకూ వెళ్లినా సీటు కోసం పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తోంది. ఇక పల్లెల్లోకి ఒక బస్సు కూడా రావడం లేదు. సమీప పట్టణాలకు వెళ్లాల్సి వస్తే ప్రైవేట్ ఆటోల్లో అధిక చార్జీలు చెల్లించాలి. నగరంలోని ఆస్పత్రులకు రావాలన్నా నరకయాతన అనుభవిస్తున్నారు. వృద్ధులు, గర్భిణుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
–రజనీ, ప్రైవేట్ పాఠశాల
ఉపాధ్యాయురాలు, బత్తలపల్లి


