ప్రశాంతి నిలయం: వసతి గృహాల్లోని విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరందిస్తామని కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్) నిధుల కింద ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు అందజేసిన 4 నీటిశుద్ధి యంత్రాలను కలెక్టర్ సోమవారం ప్రారంభించారు. వీటిని కదిరి ప్రాంతంలోని 3 బీసీ సంక్షేమ వసతి గృహాలకు, ఓ ఎస్సీ సంక్షేమ వసతి గృహానికి అందజేశారు. సీఎస్ఆర్ నిధుల ద్వారా మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో ఏపీజీబీ రీజనల్ మేనేజర్ రమేష్, పుట్టపర్తి మేనేజర్ చంద్రశేఖరయ్య, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజేంద్రకుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


