
కమనీయం.. శ్రీవారి కల్యాణోత్సవం
కదిరి టౌన్: శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీవారి కల్యాణోత్సవం కమనీయంగా సాగింది. ఏటా జేష్ట్య మాసంలో స్వామివారికి నిత్య కల్యాణం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నెలలో శనివారం పర్వదినాలు తప్ప మిగతా రోజుల్లో స్వామివారి కల్యాణాన్ని అర్చకులు నిర్వహిస్తున్నారు. సోమవారం అర్చకులు కుమార్స్వామి శ్రీరంగ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత వసంతవల్లభుని కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిపించారు. స్వామివారికి పెళ్లి కానుకలు సమర్పించారు. కార్యక్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు కర్ణాటక నుంచి భక్తులు పాల్గొన్నారు.