అన్నదాత సుఖీభవలో అర్హుల కుదింపు | - | Sakshi
Sakshi News home page

అన్నదాత సుఖీభవలో అర్హుల కుదింపు

Jun 17 2025 4:51 AM | Updated on Jun 17 2025 4:51 AM

అన్నద

అన్నదాత సుఖీభవలో అర్హుల కుదింపు

జిల్లాలో అర్హులు 2,58,561 మంది

తగ్గిన రైతుల సంఖ్య 16,770

పుట్టపర్తి అర్బన్‌: అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హుల సంఖ్య తగ్గడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో వైఎస్సార్‌ రైతు భరోసా– పీఎం కిసాన్‌ కింద ఏటా మూడు విడతల్లో రూ.13,500 రైతుల ఖాతాలకు జమయ్యింది. కూటమి ప్రభుత్వం వచ్చాక అన్నదాత సుఖీభవ ద్వారా ఏటా రూ.20వేల పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పి.. మొదటి ఏడాదిలోనే మొండి చేయి చూపింది. ప్రస్తుత రెండో ఏడాదిలో పథకం అమలుకు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు లబ్ధిదారుల జాబితాను వ్యవసాయ కార్యాలయానికి పంపారు. అయితే అందులో చాలామంది పేర్లు కనిపించలేదు. గత ప్రభుత్వంలో జిల్లాలో 2,75,331 మంది రైతులు వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ కింద లబ్ధి పొందారు. ఈ ఏడాది అన్నదాత సుఖీభవ పథకం కింద 2,58,561 మందిని అర్హులుగా తేల్చారు. గత ఏడాదితో పోలిస్తే 16,770 మంది రైతులు తగ్గిపోయారు. ఇక కొత్తగా భూములు కొన్నవారు, ఈ–కేవైసీ చేయించని వారికి అన్నదాత సుఖీభవ అందకపోవచ్చు. వారం రోజుల నుంచి రైతు సేవ కేంద్రాల్లో రైతుల వేలిముద్రలు తీసుకుంటున్నారు. ఇవన్నీ రెండో జాబితాలో రావచ్చని డీఏఓ సుబ్బారావు పేర్కొన్నారు.

అర్జీలు వేగంగా పరిష్కరించండి

ప్రశాంతి నిలయం: అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి చెందేలా పరిష్కారం చూపాలని కలెక్టర్‌ చేతన్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్‌ 242 అర్జీలు స్వీకరించారు. ఇందులో ఎక్కువగా పింఛన్‌, పక్కాగృహాలు, ఇంటి పట్టాలు, భూ సమస్యలు తదితర వాటికి సంబంధించి అర్జీలు వచ్చాయి. కలెక్టర్‌ మాట్లాడుతూ అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్దేశిత గడువులోపు నాణ్యమైన పరిష్కారం చూపేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్‌, బియాండ్‌ ఎస్‌ఎల్‌ఏ, రీఓపెనింగ్‌ సమస్యలు లేకుండా అధికారులు జాగ్రత్త పడాలన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌, డీఆర్‌ఓ విజయ సారథి, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

ఇంటి స్థలం కోసం

వినూత్న నిరసన

గోరంట్ల : కబ్జాకు గురైన ఇంటి స్థలం విషయంలో రెవెన్యూ అధికారులు న్యాయం చేయలేదని ఓ వృద్ధురాలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేసింది. రాగిమాకులపల్లికి చెందిన వడ్డి వెంకటలక్ష్మ్మకు గౌనివారిపల్లి రెవెన్యూ పొలం సర్వే నంబరు 180–2లో కొన్నేళ్ల కిందట మూడు సెంట్ల నివేశన స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. అయితే ఆమె అందులో ఇంటి నిర్మాణం చేపట్టలేదు. ఈ క్రమంలో ఆ స్థలంలో నాగులకట్ట వెలిసింది. మిగిలిన స్థలం వేరొక వ్యక్తి అధీనంలో ఉంది. అందులోకి ఆమెను రాకుండా అడ్డుకుంటున్నారు. తనకు కేటాయించిన స్థలానికి హద్దులు చూపించాలంటూ వడ్డి వెంకటలక్ష్మమ్మ గత కొంతకాలంగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. అయితే అధికారులు సమస్య పరిష్కారంలో అలసత్వం ప్రదర్శిస్తుండటంతో సోమవారం వంటసామగ్రితో తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకుని అక్కడే వంటావార్పు చేపట్టింది. తనకు న్యాయం జరిగే వరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించింది. ఈ విషయమై తహసీల్దార్‌ మారుతిని వివరణ కోరగా.. బాధితురాలికి తొలుత కేటాయించిన స్థలంలో నాగుల కట్ట.. మిగిలిన స్థలం రోడ్డు అవసరాల కోసం వినియోగించుకుంటున్నారని చెప్పారు. ఆమెకు మరొక చోట ఇంటి స్థలం ఇస్తామంటే ఒప్పుకోవడం లేదని తెలిపారు.

అన్నదాత సుఖీభవలో అర్హుల కుదింపు 1
1/2

అన్నదాత సుఖీభవలో అర్హుల కుదింపు

అన్నదాత సుఖీభవలో అర్హుల కుదింపు 2
2/2

అన్నదాత సుఖీభవలో అర్హుల కుదింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement