
నెల్లూరు (లీగల్): పొదలకూరు మండలం విరువూరులో అక్రమంగా మద్యం నిల్వలు ఉంచారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్రెడ్డిని పొదలకూరు ఎకై ్సజ్ అధికారులు నమోదు చేసిన అక్రమ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ మంగళవారం గూడూరు అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి బీవీ సులోచనరాణి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కొక్కరు రూ.లక్ష ఆస్తి విలువ కలిగిన ఇద్దరు జామీన్దార్లు పూచీకత్తు, రూ.లక్ష వ్యక్తిగత బాండ్ సమర్పించాలని ఆదే శాలు జారీ చేశారు. గోవర్ధన్రెడ్డి ఎకై ్సజ్ అధికారుల విచారణకు సహకరించాలని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.
ఈ కేసులో కాకాణి గోవర్ధన్రెడ్డిని 9వ నిందితుడిగా కేసు నమోదు చేసి జూలై 14న పీటీ వారెంట్పై గూడూరు కోర్టులో హాజరు పరచడంతో జూలై 28 వరకు జ్యూడీషియల్ రిమాండ్కు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసిన విష యం విదితమే. ఈ క్రమంలో కాకాణి తరఫున సీనియర్ న్యాయవాదులు రామిరెడ్డి రాజారెడ్డి పి.ఉమామహేశ్వర్రెడ్డి, ఎంవీ విజయకుమారి, సిద్ధన సుబ్బారెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేసి కేసులో ప్రాథమిక ఆధారాలు లేవని, కేవలం రాజకీయ కక్షతో కేసును బనాయించారని వాదనలు వినిపించారు. ఎకై ్సజ్ అధికారుల తరఫున స్పెషల్ పీపీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కాకాణి గోవర్ధన్రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.