
రొట్టెల పండగకు విస్తృత ఏర్పాట్లు
● మంత్రి నారాయణ
నెల్లూరు(టౌన్): రొట్టెల పండగకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో ఇన్చార్జి కలెక్టర్ కార్తీక్, ఎస్పీ కృష్ణకాంత్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, అధికారులతో కలిసి ఏర్పాట్లపై ఆదివారం సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దర్గా అభివృద్ధికి సీఎం రూ.5 కోట్లు మంజూరు చేశారన్నారు. 20 వేల మంది భక్తులు ఒకేచోట ప్రార్థన చేసేందుకు వీలుగా మందిరాన్ని నిధులతో నిర్మిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నుడా ఆధ్వర్యంలో ఈ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. నగరంలో అండర్పాస్లు, ఓవర్ బ్రిడ్జిల వద్ద, ఓవర్ హెడ్ ట్యాంకులు వద్ద పెయింటింగ్ పనులు సంవత్సర కాలంగా కొనసాగుతుండటంపై సంబంధిత అధికారులు, పెయింటింగ్ కాంట్రాక్టర్లపై మండిపడ్డారు. 45 రోజుల్లో అన్ని ప్రాంతాల్లో పెయింటింగ్ పనులు పూర్తి చేయాలన్నారు.