భార‌త సైన్యానికి సెల్యూట్‌.. ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము: విరాట్ కోహ్లి | Virat Kohli salutes Indian armed forces amid rising tensions with Pakistan | Sakshi
Sakshi News home page

భార‌త సైన్యానికి సెల్యూట్‌.. ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము: విరాట్ కోహ్లి

May 9 2025 10:20 PM | Updated on May 9 2025 10:20 PM

Virat Kohli salutes Indian armed forces amid rising tensions with Pakistan

PC: BCCI/IPL.com

భార‌త్‌-పాకిస్తాన్ దేశాల మ‌ధ్య ప్ర‌స్తుతం యుద్ద వాత‌వార‌ణం నెల‌కొంది. పహల్గామ్ ఉగ్ర‌దాడికి  ఆప‌రేష‌న్ సిందూర్ రూపంలో భార‌త్ బ‌దులు తీర్చుకుంది. భార‌త సైన్యం వ‌రుస‌గా రెండు రోజుల పాటు పాకిస్తాన్, పాక్తిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో దాడులు చేస్తూ వంది మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. పాకిస్తాన్  ప్రతిదాడులకు కూడా భార‌త సాయుద బ‌ల‌గాలు ధీటుగా బ‌దులిచ్చాయి. ఈ క్ర‌మంలో భార‌త స్టార్‌ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ‌ త‌మ దేశ‌భ‌క్తి చాటుకున్నారు.

"ఈ క్లిష్ట సమయాల్లో దేశాన్ని కాపాడుతున్న మన సాయుధ దళాలకు సెల్యూట్. సైన్యం ధైర్యసాహసాలకు మనం ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము. దేశం కోసం వారు, వారి కుటుంబాలు చేసే త్యాగాలకు హృదయపూర్వక  ధన్యవాదాలు తెలియ‌జేస్తున్న‌ట్లు" కోహ్లి త‌న‌ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. కోహ్లి ఈ పోస్ట్ చేసిన గంటలోనే 34 లక్షల మంది లైక్ చేస్తూ ఈ పోస్టును షేర్ చేయడం విశేషం.

భారత త్రివిధ దళాలైన ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ తీసుకునే ప్ర‌తీ నిర్ణ‌యం మ‌నల్ని స‌గ‌ర్వంగా త‌లెత్తుకునేలా చేస్తోంది. మన యోధులు మన దేశ గౌరవానికి అండగా నిలుస్తున్నారు. ఈ సమయంలో ప్రతి భారతీయుడు బాధ్యతాయుతంగా ఉండాలి. నకిలీ వార్తలను వ్యాప్తి చేయకుండా, న‌మ్మ‌కుండా ఉండాలి. అంద‌రూ సురక్షితంగా ఉండండి అంటూ రోహిత్ శర్మ ట్వీట్ చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement