IND vs SL: భారత్‌తో టీ20 సిరీస్‌.. జట్టును ప్రకటించిన శ్రీలంక.. అతను రీ ఎంట్రీ

 Sri Lanka has announced 18 member T20I squad for series against India - Sakshi

టీమిండియాతో టీ20 సిరీస్‌కు తమ జట్టును శ్రీలంక క్రికెట్ సెలక్షన్ కమిటీ సోమవారం ప్రకటించింది. ఈ సిరీస్‌కు దసున్ షనక కెప్టెన్సీలో  మొత్తం 18 మంది ఆటగాళ్లను శ్రీలంక క్రికెట్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ జట్టుకు చరిత్ అసలంక వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అవిష్క ఫెర్నాండో, నువాన్ తుషార, రమేష్ మెండిస్‌ ఈ సిరీస్‌కు దూరమయ్యారు. ఇక కరోనా బారిన పడి ఆస్ట్రేలియాతో అఖరి మూడు టీ20లకు దూరమైన వనిందు హసరంగా తిరిగి జట్టులోకి వచ్చాడు.

మరో వైపు స్పిన్నర్ అషియన్ డానీయాల్‌ శ్రీలంక తరుపున అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేయనున్నాడు. ఇటీవల 5 టీ20ల సిరీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడిన శ్రీలంక ఘోర పరాభవం మూట కట్టుకుంది. కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించింది. ఇక భారత పర్యటనలో భాగంగా శ్రీలంక మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. తొలి టీ20 లక్నో వేదికగా ఫిబ్రవరి 24న జరగనుంది.

శ్రీలంక టీ20 జట్టు
దసున్ షనక (కెప్టెన్‌), పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, చరిత్ అసలంక (వైస్‌ కెప్టెన్‌), దినేష్ చండిమాల్, దనుష్క గుణతిలక, కమిల్ మిషార, జనిత్ లియానాగే, వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, లహిరు కుమారా, బినుర ఫేర్నాన్డో, మహీష్ థెస్హానా, , జెఫ్రీ వాండర్సే, ప్రవీణ్ జయవిక్రమ, అషియన్ డేనియల్ 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top