
గాయపడిన శుచి స్థానంలో భారత మహిళల జట్టుకు ఎంపిక
ముంబై: ఇంగ్లండ్లో పర్యటించే భారత మహిళల జట్టుకు లెఫ్టార్మ్ స్పిన్నర్ రాధా యాదవ్ ఎంపికైంది. శుచి ఉపాధ్యాయ్ స్థానంలో ఆమెను ఎంపిక చేసినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక ప్రకటనలో తెలిపింది. 20 ఏళ్ల స్పిన్నర్ శుచి గత నెల శ్రీలంకలో జరిగిన ముక్కోణపు సిరీస్ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేసింది. తాజాగా ఆమె ఎడమ కాలికి గాయమైంది.
బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సీఓఈ)లో ఏర్పాటు చేసిన శిబిరంలో మహిళల జట్టు సభ్యులు పాల్గొంటున్నారు. త్వరలో అక్కడికి బయలుదేరనున్న మహిళల జట్టు ఇంగ్లండ్లో పరిమిత ఓవర్ల ద్వైపాక్షిక సిరీస్లలో ఆడనుంది. ఐదు టి20లు సహా మూడు వన్డేల సిరీస్లో ఇరు జట్లు తలపడతాయి. ఇందులో భాగంగా జూన్ 28న నాటింగ్హామ్లో తొలి టి20 జరుగుతుంది.
జూలై 1న బ్రిస్టల్లో రెండో మ్యాచ్, 4న ఓవల్లో మూడు, 9న మాంచెస్టర్లో నాలుగు, 12న బర్మింమంగ్హామ్లో ఆఖరి టి20 మ్యాచ్లు జరుగనున్నాయి. అనంతరం సౌతాంప్టన్, లార్డ్స్, చెస్టర్లీ స్ట్రీట్ వేదికలపై వరుసగా జూలై 16, 19, 22 తేదీల్లో మూడు వన్డేలు నిర్వహిస్తారు.
భారత మహిళల టి20 జట్టు: హర్మన్ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా, రిచా ఘోష్, యస్తిక, హర్లీన్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, శ్రీచరణి, అమన్జోత్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సయాలీ సత్గరే, రాధా యాదవ్.
వన్డే జట్టు: హర్మన్ప్రీత్ (కెప్టెన్), స్మృతి, ప్రతీక, హర్లీన్, జెమీమా, రిచా, యస్తిక, తేజల్, దీప్తి, స్నేహ్ రాణా, శ్రీచరణి, అమన్జోత్, అరుంధతి రెడ్డి, క్రాంతి, సయాలీ, రాధా యాదవ్.