IPL 2025: ధోని అరుదైన రికార్డు.. | MS Dhoni becomes fourth Indian cricketer to play 400 T20 matches | Sakshi
Sakshi News home page

IPL 2025: ధోని అరుదైన రికార్డు..

Apr 25 2025 9:00 PM | Updated on Apr 25 2025 9:32 PM

 MS Dhoni becomes fourth Indian cricketer to play 400 T20 matches

PC: BCCI/IPL.com

టీమిండియా దిగ్గ‌జం, చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ త‌న కెరీర్‌లో 400వ టీ20 మ్యాచ్ మైలు రాయిని అందుకున్నాడు. ఐపీఎల్‌-2025లో చెపాక్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ధోని ఈ ఘ‌న‌త సాధించాడు. ఈ ఫీట్ సాధించిన నాలుగో భారత క్రికెటర్‌గా ధోనీ రికార్డుల‌కెక్కాడు.

400 టీ20లు ఆడిన భారత ఆటగాళ్ల జాబితాలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ(456) అగ్రస్థానంలో ఉన్నాడు. రెండో స్దానంలో దినేష్ కార్తీక్ ఉండ‌గా.. మూడో స్ధానంలో విరాట్ కోహ్లి(407) కొన‌సాగుతున్నాడు. ధోని త‌న టీ20 కెరీర్‌లో భార‌త్‌, సీఎస్‌కే, రైజింగ్  పూణే సూపర్‌జెయింట్,జార్ఖండ్  జ‌ట్ల‌కు ప్రాతినిథ్యం వ‌హించాడు.

త‌న కెరీర్‌లో 400 టీ20లు ఆడి 135.90 స్ట్రైక్ రేట్‌తో 7,566 పరుగులు చేశాడు. అందులో 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా వికెట్ కీప‌ర్‌గా 318 ఔట్ల‌లో మిస్ట‌ర్ కూల్ భాగ‌మ‌య్యాడు. ఇక ఓవ‌రాల్‌గా వ‌ర‌ల్డ్ టీ20 క్రికెట్‌లో ఈ ఫీట్ సాధించిన జాబితాలో వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కిరాన్ పొలార్డ్‌(695) తొలి స్దానంలో ఉన్నాడు.

అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడిన భారత ప్లేయర్లు..
రోహిత్ శర్మ- 455 మ్యాచ్‌లు
దినేశ్ కార్తిక్- 412 మ్యాచ్‌లు
విరాట్ కోహ్లీ- 407 మ్యాచ్‌లు
ఎంఎస్ ధోనీ- 399 మ్యాచ్‌లు
రవీంద్ర జడేజా- 340 మ్యాచ్‌లు
సురేశ్ రైనా- 336 మ్యాచ్‌లు
శిఖర్ ధావన్- 334 మ్యాచ్‌లు
రవిచంద్రన్ అశ్విన్- 331 మ్యాచ్‌లు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement