ప్రియాన్ష్‌, కూపర్‌ విధ్వంసం.. పంజాబ్‌కు ఐదో విజయం | IPL 2026: Punjab Kings Won By 54 Runs Vs Lucknow Super Giants | Sakshi
Sakshi News home page

ప్రియాన్ష్‌, కూపర్‌ విధ్వంసం.. పంజాబ్‌కు ఐదో విజయం

Apr 19 2026 11:29 PM | Updated on Apr 19 2026 11:38 PM

IPL 2026: Punjab Kings Won By 54 Runs Vs Lucknow Super Giants

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ఐదో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం ముల్లన్‌పూర్‌ వేదికగా లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ 54 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులకే పరిమితమైంది. 

మార్కరమ్‌ (42 ), రిషబ్‌ పంత్‌ (43), మార్ష్‌ (40) పరుగులు సాధించారు. అయితే ఛేదించాల్సిన లక్ష్యం ఎక్కువగా ఉండడంతో  లక్నో చేతులెత్తేసింది. పంజాబ్‌బౌలర్లలో మార్కో యాన్సెన్‌ 2 వికెట్లు తీశాడు. అంతకముందు పంజాబ్‌ యువ బ్యాటర్లు ప్రియాన్ష్‌ ఆర్య, కూపర్‌ కన్నోలీ విధ్వంసంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు చేసింది. 

ప్రియాన్ష్‌ (93), కన్నోలి (87) తమ కెరీర్‌లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌ ఆడారు. చివర్లో స్టోయినిస్‌ 29 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి పంజాబ్‌ భారీ స్కోరుకు బాటలు వేశాడు. లక్నో బౌలర్లలో ప్రిన్స్‌ యాదవ్‌,మణిమరన్‌ సిద్ధార్థ్‌ చెరో 2 వికెట్లు తీశాడు. లక్నోతో మ్యాచ్‌ ద్వారా ఈ సీజన్‌లో అత్యధిక స్కోరు చేసిన పంజాబ్‌ ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట గెలిచి (వర్షంతో ఒక మ్యాచ్‌ రద్దు) 11 పాయింట్లతో పాయింట్ల పట్టికలో తన అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement