టీమిండియాతో రెండో టెస్ట్‌.. తుది జట్టును ప్రకటించిన ఇంగ్లండ్‌.. స్టార్‌ ఆటగాడికి నో ఛాన్స్‌ | England Announced Playing XI For Second Test Against Team India | Sakshi
Sakshi News home page

టీమిండియాతో రెండో టెస్ట్‌.. తుది జట్టును ప్రకటించిన ఇంగ్లండ్‌.. స్టార్‌ ఆటగాడికి నో ఛాన్స్‌

Jun 30 2025 7:34 PM | Updated on Jun 30 2025 9:07 PM

England Announced Playing XI For Second Test Against Team India

జులై 2వ తేదీ నుంచి బర్మింగ్హమ్‌ వేదికగా టీమిండియాతో జరుగబోయే రెండో టెస్ట్‌ కోసం ఇంగ్లండ్‌ తుది జట్టును ఇవాళ (జూన్‌ 30) ప్రకటించారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ తొలి టెస్ట్‌లో ఆడిన జట్టునే యథాతథంగా కొనసాగించింది. రెండో టెస్ట్‌ కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన స్టార్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. తొలి టెస్ట్‌లో రాణించిక పోయినా ఇంగ్లండ్‌ మేనేజ్‌మెంట్‌ క్రిస్‌ వోక్స్‌పై నమ్మకం ఉంచింది. 

అతనితో పాటు జోష్‌ టంగ్‌, బ్రైడన్‌ కార్స్‌ను కొనసాగించింది. నాలుగో పేసర్‌గా కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ వ్యవహరించనున్నాడు. స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా షోయబ్‌ బషీర్‌ కొనసాగనున్నాడు. బ్యాటింగ్‌ విభాగంలో జాక్‌ క్రాలే, బెన్‌ డకెట్‌, ఓలీ పోప్‌,జో రూట్‌, హ్యారీ బ్రూక్‌ తమ యధా స్థానాల్లో బరిలోకి దిగనున్నారు. వికెట్‌కీపర్‌గా జేమీ స్మిత్‌ వ్యవహరించనున్నాడు.

రెండో టెస్ట్‌ జులై 2న భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. లీడ్స్‌ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి రోజు వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేక పరాజయంపాలైంది.

ఛేదనలో బెన్‌ డకెట్‌ (149) సూపర్‌ సెంచరీ చేసి ఇంగ్లండ్‌ను గెలిపించాడు. జాక్‌ క్రాలే (65), జో రూట్‌ (53 నాటౌట్‌), బెన్‌ స్టోక్స్‌ (33), జేమీ స్మిత్‌ (44 నాటౌట్‌) తలో చేయి వేశారు. భారత బౌలర్లు సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ బ్యాటర్లను ఏమాత్రం కట్టడి చేయలేకపోయారు. ఇంగ్లండ్‌ బ్యాటర్లు భారత బౌలర్లను సునాయాసంగా ఎదుర్కొని పరుగులు చేశారు. ప్రసిద్ద్‌ కృష్ణ, శార్దూల్‌ ఠాకూర్‌ తలో 2 వికెట్లు తీసినా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. అనుభవజ్ఞుడైన స్పిన్నర్‌ రవీంద్ర జడేజాది కూడా అదే పరిస్థితి.

ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు రెండు ఇన్నింగ్స్‌ల్లో అద్బుతంగా ఆడారు. అయినా సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో బౌలర్లు ప్రభావం చూపలేకపోవడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో భారత్‌ తరఫున ఐదు శతకాలు నమోదైన ప్రయోజనం లేకుండా పోయింది. 

తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్‌ (101), గిల్‌ (147), పంత్‌ (134) సెంచరీలు చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్‌ రాహుల్‌ (137), పంత్‌ (118) శతకాలు చేశారు. ఇంగ్లండ్‌ తరఫున తొలి ఇన్నింగ్స్‌లో ఓలీ పోప్‌ (106) సెంచరీ చేయగా.. హ్యారీ బ్రూక్‌ (99) తృటిలో ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా 5 వికెట్ల ప్రదర్శన చేసినప్పటికీ ఇంగ్లండ్‌ భారీ స్కోర్ చేసింది.

టీమిండియాతో రెండో టెస్ట్‌ కోసం ఇంగ్లండ్‌ తుది జట్టు..
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement