ENG Vs IND: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌.. టీమిండియాలో మూడు మార్పులు | ENG Vs IND 4th Test: England Won The Toss And OPT To Bowl First, Here Are The Playing XI | Sakshi
Sakshi News home page

ENG Vs IND 4th Test: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌.. టీమిండియాలో మూడు మార్పులు

Jul 23 2025 3:13 PM | Updated on Jul 23 2025 3:41 PM

ENG VS IND 4th Test: England Won The Toss And Opt To Bowl, Here Are The Playing XI

మాంచెస్టర్‌ వేదికగా భారత్‌తో ఇవాళ (జులై 23) మొదలైన నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోసం భారత్‌ ఏకంగా మూడు మార్పులు చేసింది. కరుణ్‌ నాయర్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, ఆకాశ్‌దీప్‌ స్థానాల్లో సాయి సుదర్శన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, అన్షుల్‌ కంబోజ్‌ తుది జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు. 

ఈ మ్యాచ్‌తో 24 హర్యానా యువ పేసర్‌ అన్షుల్‌ కంబోజ్‌ టెస్ట్‌ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తున్నాడు. మరోవైపు ఇంగ్లండ్‌ ఈ మ్యాచ్‌ కోసం రెండు రోజుల కిందటే తుది జట్టును ప్రకటించింది. మూడో టెస్ట్‌ ఆడిన జట్టు నుంచి గాయపడిన షోయబ్‌ బషీర్‌ తప్పుకున్నాడు. అతడి స్థానంలో లియామ్‌ డాసన్‌ తుది జట్టులోకి వచ్చాడు. 

ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌ 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. తొలి, మూడో టెస్ట్‌ల్లో ఇంగ్లండ్‌ గెలువగా.. భారత్‌ రెండో టెస్ట్‌లో విజయం సాధించింది. 

తుది జట్లు..
ఇంగ్లండ్: జాక్ క్రాలీ, ⁠ ⁠బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, ⁠హ్యారీ బ్రూక్,⁠ బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), లియామ్ డాసన్, ⁠క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే,  జోఫ్రా ఆర్చర్.

భారత్‌: యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్‌, శుభమన్ గిల్, రిషబ్ పంత్ (వికెట్‌ కీపర్‌),రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్‌ ఠాకూర్‌, అన్షుల్ కంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement