తిరువనంతపురం వేదికగా న్యూజిలాండ్తో జరిగిన ఐదో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. 272 పరుగుల భారీ పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన న్యూజిలాండ్ జట్టు 19.4 ఓవర్లలో 225 పరుగులకే పరిమతమైంది. దాంతో టీమిండియా 46 పరుగుల తేడాతో విజయం సాధించి ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో 4-1తో పరిపూర్ణ ఆధిక్యంతో సిరీస్ను కైవసం చేసుకుంది. దీంతో ఫిబ్రవరిలో జరిగే టీ20 వరల్డ్ కప్లో టీమిండియా హాట్ ఫేవరెట్గా నిలవనుంది.
భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 5 వికెట్లు తీయగా, అక్షర్ పటేల్ 3 వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి, రింకూ సింగ్ చెరో వికెట్టు పడగొట్టారు. న్యూజిలాండ్ బ్యాటర్లలో ఫిన్ అల్లెన్ 80 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా రచిన్ రవీంద్ర 30 పరుగులు చేశారు. చివరిలో ఇష్ సోది 33 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్లో సెంచరీ చేసిన ఇషాన్ కిషన్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ను సూర్య కుమార్ యాదవ్ గెలుచుకున్నాడు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 271 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సంజూ శాంసన్ ఆరంభంలోనే ఔటైనప్పటికి మిగితా బ్యాటర్లు మాత్రం కివీస్ బౌలర్లను ఉతికారేశారు.
వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ విధ్వంసకర సెంచరీతో మెరిశాడు. సంజూ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన ఇషాన్ ప్రత్యర్ధి బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఓవరాల్గా 43 బంతులు ఎదుర్కొన్న ఇషాన్.. 4 ఫోర్లు, 10 సిక్స్లతో 103 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్(30 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 63) మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. అదేవిధంగా హార్దిక్ పాండ్యా(17 బంతుల్లో 1 ఫోర్లు, 4 సిక్స్లతో 42), అభిషేక్ శర్మ(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 30) దూకుడుగా ఆడారు. కివీస్ బౌలర్లలో ఫెర్గూసన్ రెండు, శాంట్నర్, జేమిసన్, డఫీ తలా వికెట్ సాధించారు.


