Gymnastics: విజేతగా నిషిక ప్రవీణ్‌ అగర్వాల్‌

CBSE Gymnastics Competition 2022 Held In Hyderabad Winners - Sakshi

CBSE Gymnastics Championship 2022: హైదరాబాద్‌లోని గాడియమ్‌ స్కూల్‌లో సీబీఎస్‌ఈ జాతీయ జిమ్నాస్టిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు జరిగాయి. దేశవ్యాప్తంగా 750 పాఠశాలలకు చెందిన 1700 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. అండర్‌–17 ఆల్‌రౌండ్‌ కేటగిరీలో గాడియమ్‌ స్కూల్‌కే చెందిన నిషిక ప్రవీణ్‌ అగర్వాల్‌ మొదటి స్థానంలో, నారాయణి మూడో స్థానంలో నిలిచారు.

భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్, జాతీయ అథ్లెటిక్స్‌ కోచ్‌ నాగపురి రమేశ్‌ విజేతలకు బహుమతులు అందజేశారు. ముగింపు కార్యక్రమంలో అరవిందో ఫార్మా డైరెక్టర్‌ మదన్‌మోహన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.    

చదవండి: T20 WC 2023: టీ20 ప్రపంచకప్‌ జట్టు ప్రకటన.. ఇద్దరు ఏపీ అమ్మాయిలకు చోటు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top