
సర్కారు బడి.. అడ్మిషన్లు ఫుల్
ఇందిరానగర్ ప్రభుత్వపాఠశాలకు నో అడ్మిషన్ బోర్డు
● 6వ తరగతిలో 50 సీట్లకు ప్రవేశ పరీక్ష ● వచ్చిన దరఖాస్తులు 340
ప్రశాంత్నగర్(సిద్దిపేట): కార్పొరేట్ పాఠశాల కాదు.. ప్రైవేటు అసలే కాదు.. అది సర్కారు బడి. అయినా అడ్మిషన్లు ఫుల్ అయ్యాయి. స్కూల్ గేట్కు నో అడ్మిషన్ బోర్డు పెట్టారంటే ఆ పాఠశాల స్థాయి ఏమిటో అర్థం అవుతుంది. అదే.. జిల్లా కేంద్రం ఇందిరానగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన ఈ పాఠశాల అన్ని రంగాల్లో ముందంజలో ఉంది. మొత్తం 1,217 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 2025–26 నూతన విద్యాసంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థుల నుంచి ఆన్లైన్లో (క్యూఆర్ ద్వారా) 560 దరఖాస్తులు వచ్చాయి. కానీ 6వ తరగతిలో 180సీట్లు మాత్రమే ఖాళీలున్నాయి. అయితే ఇందులో 130 ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు కేటాయించగా, కేవలం 50 సీట్ల కోసం 340 దరఖాస్తులు వచ్చాయి. వీటి కోసం సోమవారం పాఠశాలలో అడ్మిషన్ టెస్ట్ నిర్వహించారు. దీంతో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులతో పాఠశాల ఆవరణ అంతా సందడిగా మారింది.
ప్రతిఏటా ఇదే పోటీ
ప్రతి విద్యాసంవత్సరం ప్రారంభం వేళ.. మా పాఠశాలలో 6వ తరగతితో పాటుగా ఇతర తరగతుల్లో చేరేందుకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. 6వ తరగతిలో 50 సీట్ల కోసం సోమవారం ప్రవేశ పరీక్ష నిర్వహించాం. పాఠశాలలో విద్యావిధానం, మౌలిక సౌకర్యాల దృష్ట్యా ఇక్కడ చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.
– ప్రభాకర్రెడ్డి, ప్రధానోపాధ్యాయులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇందిరానర్

సర్కారు బడి.. అడ్మిషన్లు ఫుల్

సర్కారు బడి.. అడ్మిషన్లు ఫుల్

సర్కారు బడి.. అడ్మిషన్లు ఫుల్