రాజేశ్వర్‌రెడ్డికి స్వర్ణ కంకణం | - | Sakshi
Sakshi News home page

రాజేశ్వర్‌రెడ్డికి స్వర్ణ కంకణం

Jun 17 2025 6:57 AM | Updated on Jun 17 2025 6:57 AM

రాజేశ

రాజేశ్వర్‌రెడ్డికి స్వర్ణ కంకణం

సిద్దిపేటకమాన్‌: జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు డాక్టర్‌ కలకుంట్ల రాజేశ్వర్‌రెడ్డికి దైవజ్ఞ బిరుదుతో పాటు స్వర్ణ కంకణం ప్రదానం చేశారు. విశ్వజ్యోతి జ్యోతిష్య విజ్ఞాన సంస్థ హైదరాబాద్‌లో నిర్వహించిన సమ్మేళనంలో అవార్డు అందజేశారు. ముహూర్తం, లగ్న, భావ, నవాంశ ఫలితాలపై, బృహత్సంహితపై నిర్వహించిన సెమినార్‌లో ప్రతిభావంతులకు గుర్తించి సత్కారాలు అందజేసినట్లు రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు.

కష్టపడి పనిచేసే వారికే పదవులు

కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అబ్జర్వర్లు

చేర్యాల(సిద్దిపేట): కాంగ్రెస్‌ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుందని, రానున్న రోజుల్లో వారికే పదవులు దక్కుతాయని పార్టీ జిల్లా అబ్జర్వర్లు పవన్‌ మల్లాడి, మేనేని రోహిత్‌రావు అన్నారు. సోమవారం స్థానిక వాసవి గార్డెన్‌లో జిల్లా అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, దూల్మిట్ట మండలాల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి, గిరి కొండల్‌రెడ్డి, కొమ్ము నర్సింగరావు, దాసరి కళావతి, పుర్మ ఆగంరెడ్డి, మంజ మల్లేశం, దాసరి శ్రీకాంత్‌, కొమ్ము రవి, మహాదేవుని శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో సివిల్‌ లాంగ్‌టర్మ్‌ కోంచిగ్‌ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అహ్వానిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ కృష్ణ దయాసాగర్‌ సోమవారం తెలిపారు. గతంలో సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష పాస్‌ అయిన 50 మంది అభ్యర్థులకు, ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ ద్వారా ఎంపిక చేసిన 50 మంది అభ్యర్థులకు మొత్తంగా 100మంది అభ్యర్థులకు ఉచిత కోచింగ్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. అందుకోసం అర్హులైన అభ్యర్థులు జులై 8వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు బీసీ స్టడీ సర్కిల్‌ (040–24071178)లో సంప్రదించాలన్నారు.

ఎల్లమ్మ హుండీ ఆదాయం రూ.9.93 లక్షలు

హుస్నాబాద్‌: ఎల్లమ్మ ఆలయ మండపంలో సోమవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. రూ.9,93,957 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. గతేడాది కంటే ఈసారి రూ.14వేలు ఎక్కువగా వచ్చినట్లు తెలిపారు. జాతర సందర్భంగా వచ్చిన మిశ్రమ వెండి, బంగారం తిరిగి వెండిలో వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌ రెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్‌ బొలిశెట్టి శివయ్య, ఆలయ కార్యనిర్వాహణ అధికారి కిషన్‌ రావు, గోమాత సేవ పరిషత్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

రైతు నేస్తంపైసీఎం వీడియో కాన్ఫరెన్సు

కొండపాక(గజ్వేల్‌): కుకునూరుపల్లి, కొండపాక మండలాల్లోని రైతు వేదికల్లో రైతు నేస్తంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సాగుపై అవగాహన కల్పించారు. భూములపై పక్కాగా హక్కులుండేలా భూ భారతి తీసుకువచ్చామన్నారు. ఇందిరమ్మ పథకంలో పేదలందరికీ అంచెలంచెలుగా అవకాశం కల్పిస్తామన్నారు. పంటల మార్పిడీలతోనే అధిక దిగుబడులు పొందుతారని అన్నారు.

రాజేశ్వర్‌రెడ్డికి స్వర్ణ కంకణం 1
1/2

రాజేశ్వర్‌రెడ్డికి స్వర్ణ కంకణం

రాజేశ్వర్‌రెడ్డికి స్వర్ణ కంకణం 2
2/2

రాజేశ్వర్‌రెడ్డికి స్వర్ణ కంకణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement