ఈజీఎస్‌ పనులపరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఈజీఎస్‌ పనులపరిశీలన

Jun 17 2025 6:57 AM | Updated on Jun 17 2025 6:57 AM

ఈజీఎస్‌ పనులపరిశీలన

ఈజీఎస్‌ పనులపరిశీలన

కొండపాక(గజ్వేల్‌): కొండపాక, ముద్దాపూర్‌లో ఉపాధి హామీ పనులను జాతీయ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టరు శివశంకర్‌ తోపాటు (సెంట్రల్‌) ఎంఓఆర్‌డీ బృందం సోమవారం పరిశీలించింది. ఆయా గ్రామాల్లో పనులు జరుగుతున్న చోట్లకు వెళ్లి కూలీలతో మాట్లాడారు. ఎలాంటి పనులను చేయిస్తున్నారు? కూలీ డబ్బులు సరిగ్గా వస్తున్నాయా? లేదా అంటూ ఆరా తీశారు. భూముల లేవలింగ్‌, పాంపాండ్స్‌, రోడ్డు పనులను పరిశీలించారు. గ్రామాభివృద్ధి కోసం ఈ పనులు ఉపయోగపడుతాయా అన్న విషయాలపై ఆరా తీశారు. పనుల పారదర్శకతలను, కూలీల చెల్లింపులను అదనపు కలెక్టరు గరీమా అగర్వాల్‌ బృందానికి వివరించారు. పనుల తీరుల నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని డైరెక్టరు శివశంకర్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ జగదేవ్‌ ఆచార్య, ఈజీఎస్‌ అధికారులు, పంచాయితీ రాజ్‌ శాఖ అధికారులు, ఎంపీడీఓలు, కూలీలు తదితరులు పాల్గొన్నారు.

ఓపెన్‌ అడ్మిషన్‌ గడువు పెంపు

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఓపెన్‌ పది, ఇంటర్‌లో అడ్మిషన్‌ల గడువు జూలై 11వరకు పెంచినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి సోమవారం తెలిపారు. పూర్తి వివరాలకు జిల్లా ఓపెన్‌ స్కూల్‌ కో ఆర్డినేటర్‌ వెంకటస్వామి (80084 03635)ని సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement