పాఠశాల ఆవరణలో నాటిన మొక్కలు పెద్దగా పెరిగి చల్లదనాన్ని ఇస్తున్నాయి. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉండటంతో చెట్ల కింద కూర్చుని చదువుకుంటున్నాం. మంచి వాతావరణంలో చదుకోవడం చాలా సంతోషంగా ఉంది.
– ప్రతీక్–విద్యార్థి,
జెడ్పీహెచ్ఎస్–చీకూర్తి
ప్రతీ ఏటా మొక్కలు నాటుతాం
ప్రతి ఏటా జిల్లాలోని అన్ని ప్రభుత్వ బడుల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. పాడైన మొక్కల స్థానంలో మళ్లీ కొత్త మొక్కలు నాటుతున్నాం. నాటినవి పాడైపోకుండా ఉండేందుకు నీటిని అందిస్తున్నాం. గతంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇస్తున్నాయి. ఆ చెట్ల నీడలోనే విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు.
– వెంకటేశ్వర్లు, డీఈఓ–సంగారెడ్డి


