
నిజాయితీ చాటుకున్న కండక్టర్
టేక్మాల్(మెదక్): విధి నిర్వహణలో ఆర్టీసీ బస్ కండక్టర్ ముదిగొండ రవి నిజాయితీ చాటుకున్నారు. వివరాలు ఇలా... సంగారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నారాయణఖేడ్ నుంచి లింగంపల్లి వైపు వెళుతుంది. శంకరంపేట్ బస్టాండ్లో బొడ్మట్పల్లి వెళ్లేందుకు ప్రయాణికురాలు బస్సు ఎక్కింది. తన స్టేజ్ రావడంతో దిగిన ఆమె పర్సును బస్సులో మర్చిపోయింది. గమనించిన కండక్టర్ రవి పర్సును తెరిచి చూశారు. అందులో వెండి ఉంగరంతో పాటూ రూ. 2050 నగదు ఉంది. వివరాల కోసం పర్సులో వెతకగా ప్రయాణికురాలి కొడుకు సర్దార్ ఫోన్ నంబర్ ఉండటంతో వారికి సమాచారం అందించారు. బొడ్మట్పల్లి స్టేజ్ వద్ద ప్రయాణికురాలు, ఆమె కొడుకుకు పర్సును అందజేశారు. నిజాయితీ చాటుకున్న కండక్టర్ను ప్రయాణికులు, ఆర్టీసీ అధికారులు అభినందించారు.
ప్రయాణికురాలికి పర్సు అప్పగింత