
మానవత్వం చాటుకున్న గ్రామస్తులు
గజ్వేల్రూరల్: అనారోగ్యంతో అనాథ మృతి చెందగా గ్రామస్తులు కలిసి చందాలు వేసుకొని అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటారు. ఈ ఘటన గజ్వేల్ మండలం కొడకండ్లలో మంగళవారం జరిగింది. గ్రామస్తుల వివరాల ప్రకారం... ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్నగర్కు చెందిన స్వామి(55) ఉపాధి కోసం గజ్వేల్ మండలం కొడకండ్లలోని ఓ ప్రైవేటు కంపెనీలో పెయింటింగ్ వర్క్ కోసం 18ఏళ్ల క్రితం వచ్చి ఇక్కడే ఉండిపోయాడు. ఏడాదిగా అనారోగ్యంతో బాధపడుతున్న స్వామి మంగళవారం మృతి చెందాడు. అతడికి కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో విషయం తెలుసుకున్న గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీకాంత్తో పాటు యువకులు, దాతల సహకారంతో చందాలు వేసుకొని అంత్యక్రియలు నిర్వహించారు.
కొడకండ్లలో అనారోగ్యంతో అనాథ మృతి
చందాలతో అంత్యక్రియలు