
కామాంధుడికి రిమాండ్
యాచారం: మద్యం మత్తులో తొంభై ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడిన కామాంధుడిని పట్టుకున్న పోలీసులు, అతన్ని న్యాయస్థానంలో హాజరుపర్చి రిమాండ్కు తరలించారు. సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలో ఈనెల 11న అర్ధరాత్రి ఓ తొంభై ఏళ్ల వృద్ధురాలిపై లైంగికదాడి జరిగిన విషయం విదితమే. ఈ కేసులో 20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వీరిని పలుమార్లు విచారించారు. ఈ సమయంలో గమనించిన విషయాలతో పాటు, బాధితురాలు తెలిపిన వివరాల ఆధారంగా గ్యార శివ(23) ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. శుక్రవారం అతన్ని అదుపులోకి తీసుకుని, తమదైన శైలిలో విచారించగా నిజం అంగీకరించాడు. మద్యం మత్తులో తానే ఈ దుశ్చర్యకు పాల్పడ్డట్లు వెల్లడించారు. నగరంలో ప్రైవేటు ఉద్యోగం చేసే శివ తరచూ గ్రామానికి వచ్చి వెళ్తుంటాడు. ఇతనిపై గతంలోనూ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది.