
అదృశ్యమైన చిన్నారులు క్షేమం
శంకర్పల్లి: ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఇద్దరు చిన్నారుల కథ చివరికి సుఖాంతం అయింది. శంకర్పల్లి సీఐ శ్రీనివాస్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం సేడం తాలుకాలోని మోత్కుపల్లి గ్రామానికి చెందిన సంతోష్కుమార్, నాగమ్మలు దంపతులు. వీరు కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బంగ్లగడ్డకి వచ్చారు. అప్పటి నుంచి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే వీరికి రేణుక(13), సంతోష్(8) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. పాఠశాలలకు సెలవులు రావడంతో సొంతూరికి వెళ్లిన పిల్లలిద్దరూ ఇటీవల శంకర్పల్లికి వచ్చారు. ఇంట్లో ఇతర విషయాలపై తల్లి మందలించడంతో చిన్నారులిద్దరూ కలిసి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయారు. తల్లిదండ్రులు పీఎస్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేశారు. చివరికి చిన్నారులు ఇద్దరూ వారి సొంత ఊరిలో తన చిన్నాన్న ఇంటికి చేరుకున్నట్లు గుర్తించారు. చిన్నారులు కనిపించకకుండా పోయారనే వార్తతో శుక్రవారం శంకర్పల్లి అంతా అలజడి వాతావరణం నెలకొంది.