దేశంలో మతోన్మాద పాలన | - | Sakshi
Sakshi News home page

దేశంలో మతోన్మాద పాలన

Jun 21 2025 7:22 AM | Updated on Jun 21 2025 7:22 AM

దేశంలో మతోన్మాద పాలన

దేశంలో మతోన్మాద పాలన

శంకర్‌పల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్‌ చేశారు. శుక్రవారం శంకర్‌పల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్‌ గార్డెన్స్‌లో సీపీఐ 12వ మహాసభ ఏర్పాటు చేయగా.. ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని, దేశంలో మతోన్మాద పాలన కొనసాగిస్తుందన్నారు. అదే విధంగా కార్మికులకు నల్ల చట్టాలపై ఇచ్చిన హామీలపై మాట మార్చుతుందని, మావోయిస్టులపై జరుపుతున్న ఎన్‌కౌంటర్లను తక్షణమే నిలిపివేయాలన్నారు. సభలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యుడు ప్రభులింగం, మహిళా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మంజుల, శంకర్‌పల్లి మండల అధ్యక్షుడు సుధీర్‌, నాయకులు సుభాన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సీపీఐ జిల్లా కార్యదర్శి జంగయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement