
మోడల్ స్కూల్లో అడ్మిషన్ల దరఖాస్తుకు నేడే ఆఖరు
కందుకూరు: నేదునూరు వద్ద ఉన్న తెలంగాణ మోడల్ స్కూల్లో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ విష్ణుప్రియ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరో తరగతిలో చేరే విద్యార్థులు శనివారం సాయంత్రం వరకు పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 23న మధ్యాహ్నం 2గంటలకు రాత పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
తహసీల్లో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి
శంకర్పల్లి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్రెడ్డి గురువారం శంకర్పల్లి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. జన్వాడలో తాను కొనుగోలు చేసి ఎకరా ఇరవై గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ ప్రక్రియ పూర్తవగానే వెళ్లిపోయారు. పలువురు ఆయనతో ఫొటోలు తీసుకునేందుకు ఉత్సాహం చూపించారు.
భావి ప్రధాని రాహుల్ గాంధీ
షాద్నగర్: భారత భావి ప్రధాని రాహుల్గాంధీ అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. గురువారం రాహుల్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా నిర్వహించి భారత్ జోడో యాత్ర ద్వారా.. బీజేపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాబర్ఖాన్, బాల్రాజ్గౌడ్, కొంకళ్ళ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
మహిళా కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలిగా పుష్పవతి
మొయినాబాద్: హిమాయత్నగర్కు చెందిన ముత్యాల పుష్పవతి మహిళా కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం అధ్యక్షురాలు పామెన జ్యోతి నుంచి నియామకపత్రం అందుకున్నారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని పుష్పవతి తెలిపారు.
ప్రభుత్వ విద్యార్థులకు చేయూత
మొయినాబాద్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి స్వచ్ఛంద సంస్థలు, దాతల ప్రోత్సాహం ఎంతో అవసరమని ఎంఈఓ మల్లయ్య అన్నారు. స్వేచ్ఛ ఫౌండేషన్ సౌజన్యంతో గురువారం మొయినాబాద్ స్కూల్లోని 250 మంది విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు, పలకలు, స్టేషనరీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్వేచ్ఛ ఫౌండేషన్ చైర్మన్ వాసుదేవ్, ఫౌండర్ సభ్యులు శేషగిరిరావు, హెచ్ఎంలు జోసఫ్రెడ్డి, హమీద్, శేఖర్రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మోడల్ స్కూల్లో అడ్మిషన్ల దరఖాస్తుకు నేడే ఆఖరు